Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..
- ఢిల్లీ టూర్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు..
- రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు.. నిధుల సమీకరణ.. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఢిల్లీ టూర్..
- ఢిల్లీ టూర్లో ప్రధాని.. హోంమంత్రి సహా వివిధ కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్.. కేంద్రం నుంచి ఏయే స్కీములు, ప్రాజెక్టులను రాబట్టొచ్చనే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారు. మౌళిక వసతులకు వీలైనన్ని నిధుల రాబట్టేలా రిప్రజెంటేషన్లు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు సీఎం చంద్రబాబు.
Read Also: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
Also Read
- Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ఇక, గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసం వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందోననే అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రొత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి ముఖ్యమంత్రి విఙప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక సాయం లాంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని, హోం మంత్రి సహా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నితీన్ గడ్కరి, జేపీ నడ్డా, సీఆర్ పాటిల్ లాంటి కేంద్రలమంత్రులతో చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!