PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- భోగాపురంలో 48 గంటల నో ఫ్లైయింగ్ జోన్..
- ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రత..
- భోగాపురం పరిసరాల్లో డ్రోన్లపై పూర్తిగా నిషేధం..
- ఐదు కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi AP Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం పర్యటన నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాలను 48 గంటల పాటు నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు జూలై 30 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. విమానాశ్రయం, సభా వేదిక, హెలిప్యాడ్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో డ్రోన్లు, యూఏవీలు (UAVలు), పారా గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్లు వంటి ఎలాంటి గగనతల పరికరాలను వినియోగించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
బీఎన్ఎస్ఎస్-2023 సెక్షన్ 163 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా జరిగేలా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. కాగా, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేయనున్నారు.. దాదాపు 2 గంటలకుపైగా మోడీ పర్యటన కొనసాగనుంది.. ఆగస్టు 1వ తేదీన అంటే శనివారం రోజు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.05 వరకు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.. ఉదయం 10.45కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు మోడీ.. ఇక, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు టెర్మినల్ భవనానికి చేరుకోనున్నారు ప్రధాని.. భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ..
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
తాజావార్తలు
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
-
PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
-
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
-
Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?