CM Chandrababu: నా చుట్టూ తిరగకండి.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు..
- సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు
- నా చుట్టూ తిరగకండి.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు
- పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నా చుట్టూ తిరగకండి.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావు అంటూ కార్యకర్తలకు సూచించారు. పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా గాని ఇన్ డైరెక్ట్ గా గాని పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అని సూచించారు. మీరు ఆ పని చేస్తే పాముకి పాలు పోసినట్టేనని అన్నారు.
Also Read:Amitabh Bachchan:1990ల్లోనే అమితాబ్ బచ్చన్పై 55 కేసులు, 90 కోట్ల అప్పులు.. ఎలా అధిగమించారు?
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అలా చేసే వారి మొత్తం వివరాలను నేను తెప్పించుకుంటున్నాను అని తెలిపారు. మాటలు కాదు ఓట్లు తెప్పించుకున్న వాడే విజేత. నా చుట్టూ తిరుగుతూ వీరుడు సూర్యుడు అని పొగడ్తలు చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. జీడి నెల్లూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారాలన్నారు. జీడి నెల్లూరు సభ్యత నమోదులో 90వ ర్యాంకు ఉంది. పేదల సేవ అనే మీటింగ్స్ 8 పెడితే 5 మీటింగులకు డుమ్మా కొట్టారు. మూడింటికి మాత్రమే ఎమ్మెల్యే అటెండ్ అయ్యారన్నారు. ఈ లెక్కల్లో నాకు ఏమీ సంబంధం ఉండదు.. చిత్రగుప్తుని లెక్కల్లాగా ఇక్కడ అన్ని రికార్డు అవుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి మీద ప్రజా అభిప్రాయ సేకరణ నిరంతరం కొనసాగుతూనే ఉందన్నారు.
Also Read:Gold Hunt: మీరు మారరా? వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్.. చివరకు ఏమైందంటే?
సోషల్ మీడియానే భవిష్యత్తు ఆయుధం… మనం చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఇదే సరైన వేదిక అని స్పష్టం చేశారు. ఎక్కడ ఎన్ని పనులు పెట్టుకున్నా కార్యకర్తలను కలవడం ఒక బాధ్యతగా పెట్టుకుంటాను అని తెలిపారు. కార్యకర్తలకు గౌరవం ఇవ్వడమే కాదు అవసరమైతే కొరడా జులిపిస్తాను అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కార్యకర్తలతో 45 సంవత్సరాల అనుబంధం నాది.. గత ఎన్నికల్లో నా దగ్గరి స్నేహితులను సైతం ప్రజా ఆమోదం లేదని పక్కన పెట్టాను.. సీటు ఇవ్వలేను కావాలంటే కాఫీ, టీ ఇస్తా, డిన్నర్ పెడుతా.. కానీ, పార్టీనీ త్యాగం చేయాలేను అని చెప్పారు. ఇకపై నిరంతరం పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నా ప్రణాళికలు ఉంటాయని సీఎం ప్రకటించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!