Gold Hunt: మీరు మారరా? వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్.. చివరకు ఏమైందంటే?
- వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్
- గోతుల్లో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచి పెట్టానని రీల్
- యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా మోజులోపడి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తు తమ పైత్యాన్ని చాటుకుంటున్నారు. ఇన్ స్టాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఓ యూట్యూబర్ మనీ హంట్ పేరుతో రీల్స్ చేసి హల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పోలీసులు ఆ యూట్యూబర్ తిక్కకుదిర్చి అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో ఓవరాక్షన్ చేశాడు. చివరకు ఏమైందంటే?
Also Read:SLBC Tunnel: 5 మృతదేహాల వెలికి తీత?.. మూడింటి కోసం ముమ్మర గాలింపు..
Also Read
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలంగా మారింది. మందపాటి ఆదిత్య అనే యువకుడు ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ పెంచుకునేందుకు గోల్డ్ హంట్ పేరుతో హైడ్రామా నడిపాడు. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలోకి ప్రవేశించిన ఆదిత్య గోతులు తీశాడు. ఆ గోతుల్లో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచి పెట్టానని.. ఎవరికి దొరికితే వారు స్వంతం చేసుకోవచ్చని ప్రకటించాడు. ఇది తెలిసిన అతని ఫాలోవర్స్ స్టేడియానికి పరుగులు తీశారు.
Also Read:KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
200 పైగా అతని ఫాలోవర్స్ అక్కడికి చేరుకుని స్టేడియంలో గోతులు తవ్వుతూ వెతకడం ప్రారంభించారు. దీంతో స్టేడియం అంతా గోతులయ్యాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కోనసీమ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరేష్ కుమార్ తెలిపారు. స్టేడియం అంతా గోతులు తీయడంపై అధికారులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!