Gold Hunt: మీరు మారరా? వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్.. చివరకు ఏమైందంటే?
- వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్
- గోతుల్లో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచి పెట్టానని రీల్
- యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా మోజులోపడి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తు తమ పైత్యాన్ని చాటుకుంటున్నారు. ఇన్ స్టాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఓ యూట్యూబర్ మనీ హంట్ పేరుతో రీల్స్ చేసి హల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పోలీసులు ఆ యూట్యూబర్ తిక్కకుదిర్చి అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో ఓవరాక్షన్ చేశాడు. చివరకు ఏమైందంటే?
Also Read:SLBC Tunnel: 5 మృతదేహాల వెలికి తీత?.. మూడింటి కోసం ముమ్మర గాలింపు..
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలంగా మారింది. మందపాటి ఆదిత్య అనే యువకుడు ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ పెంచుకునేందుకు గోల్డ్ హంట్ పేరుతో హైడ్రామా నడిపాడు. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలోకి ప్రవేశించిన ఆదిత్య గోతులు తీశాడు. ఆ గోతుల్లో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచి పెట్టానని.. ఎవరికి దొరికితే వారు స్వంతం చేసుకోవచ్చని ప్రకటించాడు. ఇది తెలిసిన అతని ఫాలోవర్స్ స్టేడియానికి పరుగులు తీశారు.
Also Read:KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
200 పైగా అతని ఫాలోవర్స్ అక్కడికి చేరుకుని స్టేడియంలో గోతులు తవ్వుతూ వెతకడం ప్రారంభించారు. దీంతో స్టేడియం అంతా గోతులయ్యాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కోనసీమ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరేష్ కుమార్ తెలిపారు. స్టేడియం అంతా గోతులు తీయడంపై అధికారులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!