CM Chandrababu: సీఎం కీలక ప్రకటన.. డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
- డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తాం- సీఎం
- 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం- చంద్రబాబు
- విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయి- సీఎం
- ప్రభుత్వ.. ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు అవగానే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. విశాఖలో లూలు గ్రూప్ వచ్చింది.. బాగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1995లో చంద్రబాబును చూపించాలనుకుంటున్నా.. మొన్నటి వరకు సీఎంగా ఉన్న వ్యక్తి జలజలా మొత్తం పీల్చేశారని ఆరోపించారు. తన జీవితంలో ఎందరినో చూసానని.. ఇలాంటి వ్యక్తిని చూడలేదని దుయ్యబట్టారు.
Read Also: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు
Also Read
ఆ మాజీ సీఎం ఎస్కో బార్.. కొలంబియాలో స్మగ్లర్ లాంటి వాడని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 93 శాతం ఎమ్మెల్యే అభ్యర్థులను, 21 మంది ఎంపీలను గెలిపించారు.. అదే తమకు సంజీవని అన్నారు. 21 మందిని గెలిపించకుండా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు తాను అండగా ఉంటానని చెప్పారు. అలాగే.. అన్ని చెరువులకు హంద్రీ నీవా నీరు ఇవ్వాలని ఆలోచించాను.. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం.. వైసీపీ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి వేయలేదని ఆరోపించారు. అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!
ఎవరికి ఏ ఉద్యోగాలు ఇచ్చామో లెక్క వేసుకుంటూ ముందుకు వెళతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్జీల్లో 50 శాతం భూ సమస్యలు వస్తున్నాయి.. మీ భూములు వేరే వాళ్ళు రాసుకొన్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాపీలు ఇక్కడే కాల్చేశారు.. భూ సర్వే పేరుతో బౌండరీస్ మార్చేశారు.. మీ పట్టాదారు పాస్ బుక్ పై ఆనాటి సీఎం ఫోటో వేసుకున్నారు.. ఇకపై రాజముద్రతో పట్టాదారు బుక్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం.. 15 రూపాయలకే మూడు పూటలా భోజనం ఎక్కడైనా పెడతారా.. అన్నా క్యాంటీన్ లో తప్పా అని అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పా.. మీకు దగ్గరగా నది, వాగు ఉంటే ఇసుక ఉచితంగా తెచ్చుకోండి.. హంద్రీనీవా నుంచి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పుచ్చకాయలమాడకు మంజూరు చేస్తానని చెప్పారు.
Apple AirPods: ఎయిర్పాడ్ ద్వారా చోరీకి గురైన.. రూ.5 కోట్ల విలువైన ఫెరారీ కారు లభ్యం!
పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచే ప్రయత్నం చేశారు.. వర్షాలు అధికంగా వచ్చినా నిలువ ఉంచుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ ప్రభుత్వం వారు చేయలేమంటే కన్నయ్య నాయుడును పంపించి చేయించామని తెలిపారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా పింఛన్ వెయ్యి, 2 వేలు ఇస్తున్నారు.. ఇక్కడ 4 వేలు ఇస్తున్నామన్నారు. ఎన్టీఆర్ 30 రూపాయలు పింఛన్ మొదలు పెడితే.. తాను సీఎం అయ్యాక 70, ఆ తరువాత 200 చేశా.. ఆ తరువాత వెయ్యి, 2 వేలు చేశా.. ఇపుడు 4 వేలు ఇస్తున్నానని అన్నారు. మరోవైపు.. మద్యం షాపుల్లో బిసిలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాం.. ఇకపై మద్యం కోసం కర్ణాటక, తెలంగాణకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. క్వార్టర్ బాటిల్ 99కి ఇవ్వాలని ఆదేశించా.. తాగకుండా చేయాల్సిన బాధ్యత ఆడబిడ్డలదేనని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి.. విజన్ 2020 అని తాను చెప్తే ఎగతాళి చేశారు.. ఇపుడు 2047కి భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. భారత్లో ఏపీ నెంబర్ 1గా ఉండాలి అని అన్నారు. పేదరిక నిర్మూలన తన ధ్యేయమని సీఎం చంద్రబాబు చెప్పారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..