CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
- పవన్ కల్యాణ్తో కూటమికి బలం.. ‘ఏపీ బ్రాండ్’ పునరుద్ధరణ
- రూ.10 లక్షల కోట్ల అప్పుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్న సీఎం
- 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి
- 2047 నాటికి దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా ఏపీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోగతి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మరియు కూటమి ప్రభుత్వ విజన్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతోనే రైతులు రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. అయితే, గత పాలకుల హయాంలో ప్రజావేదికను కూల్చివేయడమే కాకుండా, పెట్టుబడులను తరిమేస్తూ రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. ఆ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్కు రావడానికి పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ‘ఏపీ బ్రాండ్’ను పునరుద్ధరించి పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించామని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో జరిగిన రూ.10 లక్షల కోట్ల అపారమైన అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాలా తీసే స్థితికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల కోసం గతంలో ఏ కేంద్రమంత్రి దగ్గరకు వెళ్లినా తిరిగి మన చేతికే కాగితాలు ఇచ్చేంతగా వ్యవస్థలు ధ్వంసమయ్యాయని చెప్పారు. వెంటిలేటర్పై ఉన్న అటువంటి ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్సిజన్ అందించి కాపాడుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ అప్పులన్నింటినీ రీషెడ్యూలు చేస్తూ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే రూ.12 వేల కోట్లతో కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించామని వెల్లడించారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లను తిరిగి నిలబెట్టేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని చంద్రబాబు వివరించారు.
Also Read
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
గతంలో పరదాల చాటున సాగిన పాలనకు భిన్నంగా, ఇప్పుడు ప్రజల మధ్యే ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నామని సీఎం అన్నారు. క్యాబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ మీటింగ్లు, కలెక్టర్ల సదస్సులు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేస్తున్నామని, “సీఎం అంటే కామన్ మ్యాన్” అనే నినాదంతోనే తమ పాలన సాగుతోందని చెప్పారు. “సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లు” అన్న ఎన్టీఆర్ ఆశయాన్ని తాము శిరోధార్యంగా భావిస్తున్నామన్నారు. కేవలం అప్పులు చేసి సంక్షేమం అందించడం కాకుండా, సంపద సృష్టించి సంక్షేమాన్ని పంచడమే టీడీపీ లక్ష్యమని, అందులో భాగంగానే మొదటి తేదీనే పెన్షన్, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2.0 వంటి పథకాలను సమర్థవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పడానికి గూగుల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థ, ఆర్సెలార్ మిట్టల్ వంటి అంతర్జాతీయ పరిశ్రమలు ఏపీకి రావడమే నిదర్శనమని చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (FDI) ఒక్క ఆంధ్రప్రదేశ్కే 25 శాతం రావడం విశేషమన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ ఇలా అన్నిటికీ ముందే తేదీలు ఖరారు చేసుకుని ఒప్పందాలు చేసుకుంటున్నామని, కేవలం 36 రోజుల్లోనే 5వ తరం ఫైటర్ జెట్ తయారీ మరియు టెస్టింగ్ ప్రాజెక్టు ఏపీకి రావడం ఇక్కడి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అద్దం పడుతోందని కొనియాడారు.
రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను పూర్తిగా తగ్గించి, ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమాజంలో అత్యంత అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ‘ఎంబీకే 10-20’ (MBK 10-20) కార్యక్రమం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని (GSDP) రూ.17 లక్షల కోట్ల నుంచి గణనీయంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2047 నాటికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనే సుదూర లక్ష్యంతో తాము రూపొందించిన ‘పది సూత్రాల విజన్’ ద్వారా ఒక్కో మెట్టూ పైకి ఎదుగుతామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్… ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!