Peddireddy: వైఎస్ జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్ళందరూ ఏకమవుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy on Amit Shah: విశాఖపట్నంలో అమిత్ షా ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఏపీ మంత్రులు అంతా అమిత్ షాను, బీజేపీని టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు మంత్రులు విమర్శల వర్షం కురిపించగా ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించగా ఆ సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్ళందరూ కలుస్తున్నారని, పేదలకు మంచి చేసినందుకు అవినీతి ప్రభుత్వం అని బ్రాండ్ వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Call Money Case: విజయనగరంలో బయటపడ్డ కాల్ మనీ కేసు..మరీ ఇంత అరాచకమా?
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
ఎన్టీ రామారావును మోసం చేసి పార్టీని, పార్టీ గుర్తును లాక్కున్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే తప్ప, ఎన్టీఆర్ టీడీపీ వారు ఎవరు లేరని అన్నారు. కొన్ని మీడియా ఛానెల్స్ ను అడ్డుపెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని, మొన్న శ్రీకాళహస్తిలో, నిన్న విశాఖలో అవినీతి ప్రభుత్వం అని విమర్శించారని కానీ అసలు అవినీతి టిడిపి హయాంలో జరిగిందని అన్నారు. మేము రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వివిధ పథకాల ద్వారా చెల్లించామని, చంద్రబాబు కోవర్టులను బీజేపీకి పంపించి వైసీపీకి అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 20 పార్లమెంట్ సీట్లు గెలవాలని కొందరు అంటున్నారు కానీ వైసీపీ 25 ఎంపీ సీట్లు సాధిస్తుందని అన్నారు. గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి భారీ విజయం సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!