Call Money Case: విజయనగరంలో బయటపడ్డ కాల్ మనీ కేసు..మరీ ఇంత అరాచకమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Call Money Case at Vizianagaram District: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన కాల్ మనీ కేసులు మరోసారి తెరమీదకు వచ్చాయి. గతంలో విజయవాడలో కలకలం రేపిన ఈ కేసులు ఇప్పుడు మాత్రం విజయనగరంలో తాజాగా బయట పడ్డాయి. విజయనగరం జిల్లాలోని జామి మండల కేంద్రానికి చెందిన చుక్కా వెంకట రావు అలియాస్ బస్సన్న తమను వేధిస్తున్నాడంటూ జిల్లా ఎస్పీ స్పందనలో చుక్కా మహాలక్ష్మి, పొట్నూరు భవాని అనే ఇద్దరు మహిళా బాధితులు ఫిర్యాదు చేశారు. జామి మండల కేంద్రంలో చుక్కా వెంకట్రావు చిట్టీల నిర్వహించే వాడని ఈ క్రమంలో తమ నుంచి అక్రమంగా లక్షలకు లక్షల వసూలు చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతన్ని చిట్టీల డబ్బులు తిరిగి ఇమ్మంటే ఇంకా వడ్డీ కట్టాల్సి ఉందని, అది కట్టలేని పక్షంలో తమను పడుకోమని వేధిస్తున్నాడని, తమను కులం పేరుతో బూతులు తిడుతున్నారు అని స్పందనలో ఫిర్యాదు చేశారు.
Also Read: Gudivada Amarnath: ఏపీలో బీజేపీ లేదు అది టీజేపీ.. షా కామెంట్లపై గుడివాడ మార్క్ కౌంటర్లు
Also Read
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
చుక్కా వెంకట్రావు వద్ద 14 లక్షల రూపాయలకు 3 చిట్టీలు కట్టామని, ప్రతీ నెలా చిట్టీల కోసం కట్టాల్సిన డబ్బులు లేటయిపోయిందని చుక్కా వెంకట్రావు ఫెనాల్టీలు వేసి వసూలు చేసేవాడని పేర్కొన్నారు. అలా ఫెనాల్టీల రూపంలో మరో 6 లక్షలు, వడ్డీల రూపంలో మరో 9 లక్షలు చుక్కా వెంకట్రావు కట్టించుకున్నట్టు పేర్కొన్నారు. అలా 14 లక్షల చిట్టీల కోసం పొట్నూరు భవాని నుండి ఇప్పటివరకు 29 లక్షలు వెంకట్రావు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో 6 లక్షలు కట్టాల్సి ఉందని, లేని పక్షంలో తనతో పడుకోవాంటూ వేధిస్తున్నాడని పొట్నూరు భవాని అనే మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మరోపక్క చుక్కా మహాలక్ష్మి వెంకట్రావు వద్ద లక్షా 70 వేల రూపాయలు అప్పు తీసుకుని, 3 లక్షల రూపాయల చొప్పున మూడు చిట్టీలు కట్టింది.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
తీసుకున్న అప్పు, దాని వడ్డీలు, చిట్టీలకు ఫెనాల్టీలు, వడ్డీలు కలిపి నుండి ఇప్పటి వరకు చుక్కా మహాలక్ష్మి నుంచి 18 నుంచి 20 లక్షలు వసూలు చేశాడట చుక్కా వెంకట్రావు. ఇవి కాక తనఖా కింద ఇంటి డాక్యుమెంట్ లు, బంగారు నగలు వసూలు చేసిన చుక్కా వెంకట్రావు డబ్బులు కట్టిన వివరాలు పొందుపరిచే జమా పుస్తకాలు చించేసినట్టు సదరు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. దుబాయ్ వెళ్లక ముందు తమ వద్ద నుంచి ఖాళీ స్టాంప్ పేపర్లు, ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో రెండేళ్ల పాటు పని చేసి సంపాదించిన మొత్తం డబ్బులు వెంకట్రావుకే కట్టామని, ఇప్పుడు తిరిగి చెల్లించమని అడిగితే తమను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. తామే కాదు అనేకమంది వెంకట్రావు బాధితులు సూసైడ్ లు చేసుకున్నారని, తమను ఆదుకోవాలని.. లేదా తమకు ఆత్మహత్యలే గతి అని అంటూ బాధితులు వాపోయారు.
తాజావార్తలు
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!