CM Chandrababu: సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా..!
- సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ..
- తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
- కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపన..
- కుప్పంకు ఎయిర్ పోర్ట్ వస్తుంది.. స్వర్ణ కుప్పమే నా టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉండే ల్యాండ్ రికార్డులు మొత్తం మార్చేశారు.. 22ఏ కిందా ప్రజల భూములను పెట్టి వైసీపీ నేతలు వేధించారు.. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారు అని ఆరోపించారు.. అయితే, రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తున్నాం.. ప్రజలకు భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటాను అన్నారు.. కుప్పం హార్టికల్చర్ హాబ్ అవుతుందన్నారు.. గత ఐదేళ్లుగా నకిలీ మద్యం తాగి ఇష్టానుసారం ప్రవర్తించారు… రోడ్డుమీదకు వచ్చి మహిళలపై దాడులు చేశారు… నన్నే కుప్పానికి రానుకుండా చేశారు.. సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 ఇక్కడ.. తప్పుచేస్తే తోక కట్ చేస్తా అంటూ హెచ్చరించారు..
Read Also: Japan Airlines: 36వేల నుంచి 10వేల అడుగుల ఎత్తుకు పడిపోయిన విమానం.. చివరికీ…(వీడియో)
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయ నేరస్తుల మయం అయిపోయింది.. బాబాయ్ని చంపి.. బాబాయ్ కూతురుతో అన్న మంచోడని చెప్పించారు… నేను హత్య, శవ రాజకీయాలు చేయాను అన్నారు చంద్రబాబు.. ప్రజాహితం రాజకీయాలే నాకు తెలుసు.. ధర్మాని కాపాడుతాను.. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తాను.. కానీ, అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుకోవాలని చూస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, వాట్స్ అప్ గవర్నెన్స్ తో సులువుగా సేవలు పొందవచ్చు… వెయ్యి కోట్లతో పలమనేరు… కృష్ణగిరి నాలుగు లైన్లు రోడ్డు అభివృద్ధి చేస్తాం.. కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు… అభివృద్ధి కావాలి… సంక్షేమం జరగాలన్నారు.. ఇంటింటికి చేసినా అభివృద్ధి చెప్పడానుకి సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం అభివృద్ధే నా లక్ష్యం అభివృద్ధి చేసి చూపిస్తా.. స్వర్ణ కుప్పం లక్ష్యంగా పెట్టుకున్నా.. చేసి తీరుతాం.. ఈ ఏడాదే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వస్తాయన్నారు.. కుప్పం ప్రజలు మట్టిలో నడవకుండా రోడ్లు వేస్తాం అన్నారు.. గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మేం అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నాం.. కుప్పంకు ఎయిర్పోర్ట్ కూడా వస్తుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!