CM Chandrababu: కుప్పంలో ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభం.. ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తా..!
- సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన..
- నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం ప్రారంభం..
- ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకానికి శ్రీకారం..
- కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. ఐదేళ్ళుగా గంజాయి రాష్ట్రంగా ఏపీని వైసీపీ మార్చింది.. యువతరాన్ని నాశనం చేసింది.. ఏపీలో గంజాయి లేకుండా చెయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 సేవలు తీసుకుని వస్తున్నాం.. ఇంటి నుండే ప్రతిసేవ పొందేలా చేస్తాం. ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును కుప్పానికి, రాష్ట్రానికి తీసుకుని వస్తాను.. కుప్పానికి రాబోయే రోజుల్నీ మంచి రోజులే అన్నారు. గండికోట నుండి కుప్పంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం అన్నారు.. నేను రాకపోయినా మీరు నన్ను గెలిస్తూ వచ్చారు.. కానీ, ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు.. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. ఇకపై కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Revanth Reddy: మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా
Also Read
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
చెడు వ్యక్తులకు సహకరించకండీ.. ఎన్ని తప్పులు చేయాలో అనే తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి.. వచ్చేసారికి ఆ సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజముద్రతో మీ భూమిని మీకు ఇచ్చేలాగా చేస్తాను.. సోలార్ పథకాన్ని, నెట్ జీరో మ్యానెజ్ మెండ్ కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.. రాష్ట్రంలో మొదటగా 20 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందిస్తాం.. తొలిగా ఈ పథకాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.. నా చిన్నప్పుడు కరెంట్ వస్తే తెగ సంతోషం వేసేది.. భవిష్యత్ లో సోలార్, విండ్ పవర్ వల్ల కరెంట్ చార్జీలు చాలా తగ్గుతాయి అన్నారు. సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే.. ఎన్నో లాభాలు ప్రజలు ఉంటుంది.. ఉచితంగా కరెంట్ రావడంతో పాటు మిగిలింది గ్రిడ్ కు అమ్ముకోవచ్చు అని సూచించారు.. కేన్సర్ సహా పలు జబ్బులకు కారణం రకరకాల కాలుష్యం వల్లే అన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ ఎనర్జీ వల్ల జబ్బులు దూరంగా ఉండచ్చు.. వర్షపు నీటినీ భూగర్భజలాలు గా మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
-
LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!