CM Chandrababu: కుప్పంలో ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభం.. ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తా..!
- సొంత నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన..
- నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం ప్రారంభం..
- ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకానికి శ్రీకారం..
- కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అని వార్నింగ్..
CM Chandrababu: మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. ఐదేళ్ళుగా గంజాయి రాష్ట్రంగా ఏపీని వైసీపీ మార్చింది.. యువతరాన్ని నాశనం చేసింది.. ఏపీలో గంజాయి లేకుండా చెయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 సేవలు తీసుకుని వస్తున్నాం.. ఇంటి నుండే ప్రతిసేవ పొందేలా చేస్తాం. ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును కుప్పానికి, రాష్ట్రానికి తీసుకుని వస్తాను.. కుప్పానికి రాబోయే రోజుల్నీ మంచి రోజులే అన్నారు. గండికోట నుండి కుప్పంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం అన్నారు.. నేను రాకపోయినా మీరు నన్ను గెలిస్తూ వచ్చారు.. కానీ, ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు.. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. ఇకపై కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Revanth Reddy: మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా
Also Read
- RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్ ఎటాక్..!
- Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
- AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
- Young Man D*ied with Heart Attack in Gym: జిమ్లో గుండెపోటుతో యువకుడు మృతి..
చెడు వ్యక్తులకు సహకరించకండీ.. ఎన్ని తప్పులు చేయాలో అనే తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి.. వచ్చేసారికి ఆ సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజముద్రతో మీ భూమిని మీకు ఇచ్చేలాగా చేస్తాను.. సోలార్ పథకాన్ని, నెట్ జీరో మ్యానెజ్ మెండ్ కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.. రాష్ట్రంలో మొదటగా 20 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందిస్తాం.. తొలిగా ఈ పథకాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.. నా చిన్నప్పుడు కరెంట్ వస్తే తెగ సంతోషం వేసేది.. భవిష్యత్ లో సోలార్, విండ్ పవర్ వల్ల కరెంట్ చార్జీలు చాలా తగ్గుతాయి అన్నారు. సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే.. ఎన్నో లాభాలు ప్రజలు ఉంటుంది.. ఉచితంగా కరెంట్ రావడంతో పాటు మిగిలింది గ్రిడ్ కు అమ్ముకోవచ్చు అని సూచించారు.. కేన్సర్ సహా పలు జబ్బులకు కారణం రకరకాల కాలుష్యం వల్లే అన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ ఎనర్జీ వల్ల జబ్బులు దూరంగా ఉండచ్చు.. వర్షపు నీటినీ భూగర్భజలాలు గా మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!