Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Meets With Mango Farmers Pulp Industries And Processing Units In Kuppam

CM Chandrababu: మామిడి రైతులకు సమస్య లేకుండా కార్యాచరణ.. సీఎం ఆదేశాలు

Published Date :July 3, 2025 , 5:38 pm
By Sudhakar Ravula
  • మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలి..
  • సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు..
  • కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులతో భేటీ..
  • మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం..
CM Chandrababu: మామిడి రైతులకు సమస్య లేకుండా కార్యాచరణ.. సీఎం ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.

Read Also: Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..

ఇక, ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని.. ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఉత్పత్తి రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోడానికి స్థలం లేదని పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల అన్ లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్ , ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు సీఎంకు తెలియచేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు.

Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు.. కాటన్ బాక్సుల్లో కార్మికుల శరీర భాగాలు

దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, జీఎస్టీ తగ్గింపు పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్ధులకు మూడు రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. మామిడి పంటలో ఎరువులు, పురుగుమందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేస్తోందని.. మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు , పురుగుమందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెస్టింగ్ , ట్రేసింగ్, సర్టిఫికేషన్ వచ్చిందని .. మన ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు రూ.8 ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chittoor District
  • CM Chandrababu Naidu
  • kuppam
  • Mango Farmers

తాజావార్తలు

  • KKR vs MI : ముంబై ఇండియన్స్ చారిత్రాత్మక విజయం.. 14 ఏళ్ల నిరీక్షణకు తెర.!

  • Chairman’s Desk : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ పెను మార్పులు తెస్తుందా?

  • Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

  • Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

ట్రెండింగ్‌

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions