Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రీల్స్ చేస్తూ.. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని మోజులో పడి నలిగి పోతున్నారు. గంటలతరబడి రోజుల తరబడి రీల్స్ చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలామంది ఇన్స్ట్రాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్ ని స్ర్కోల్ చేస్తూ కూర్చోవడం గమనిస్తుంటాం. హాస్పిటల్ లో పేషంట్ పక్కనే కూర్చుని చేతిలో సెల్ఫోన్ పట్టుకుని రీల్స్ చూస్తూ గడిపేవారు కోకొల్లలు. ఇలా అందరికీ ఈ పిచ్చి ముదిరిపోయింది. అయితే.. ఇలా గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల జరినే అనర్థాల గురించి పరిశోధకులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్ ఆఫర్లు .. యూవీ సంస్థ కీలక ప్రకటన
Also Read
- Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Mango Sharbat : ఎండవేడిని తరిమికొట్టే 'మామిడి పండ్ల షర్బత్'.. ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి.!
- Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
అదే పనిగా ఇన్స్ట్రాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో రీల్స్, షాట్స్ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని నిపుణులు వెల్లడించారు. దీంతో ఆరోగ్యం దెబ్బ తినడంతో పాటు తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని, మరి ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టిలోపాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. అధిక స్క్రీన్ టైంతో కంటిపై పడే డిజిటల్ ఒత్తిడి ఓ నిశబ్దపు మహమ్మారిగా కంటి చూపును దెబ్బతీస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా రీల్స్ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్లు పొడిబారిపోవటం, హాస్వ దృష్టి పెరగటం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్న వయస్సులోనే మెల్లకన్ను రావటం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు.
READ MORE: Report: నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు.. ప్రమాదంలో పసిపిల్లలు..
నలుగురూ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకోవడం మానేశారు. ఎందరిలో ఉన్నా.. ఫోన్ మీదే, రీల్స్ మీదే దృష్టి పెట్టడంతో చాలా విషయాలు తెలుసుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో తల్లులు తాము ఇంటి పని చేస్తున్నప్పుడు పిల్లలు విసిగిస్తున్నారని వారికి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఇలా పిల్లలు గంటల తరబడి రీల్స్, వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఇలాంటి పిల్లలకు మాటలు త్వరగా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రీల్స్ చూడటం తగ్గించుకుని పిల్లలకు పుస్తకాలు చదవటం అలవాటు చేయించాలి. మరీ చిన్న పిల్లలకు ఏదైనా సృజనాత్మకతను పెంచే ఆటలు ఆడించాలి. ముఖ్యంగా పెద్దలు పిల్లల ముందు రీల్స్ చూడటం మానేయాలి. ఎందుకంటే.. పెద్దలను పిల్లలు అనుసరిస్తునే ఉంటారు.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్కు శాపమయ్యాయా?
-
Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్