Chandrababu: నాడు చెల్లి.. నేడు తల్లి వెళ్లిపోయింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అయితే, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలపై స్పందిస్తూ.. మొన్నటి వరకు జగన్ అందరినీ వాడుకున్నాడు అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నగరిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వాడుకుని వదిలేయడం జగన్ అలవాటుగా మారిందని విమర్శించారు.. మొన్న చెల్లి (వైఎస్ షర్మిల) వెళ్లిపోయింది.. ఇప్పుడు తల్లి (వైఎస్ విజయమ్మ) కూడా వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక, చీకటి పాలన వద్దు… చీకటి జీవోలు వద్దు అని నినదించిన ఆయన.. ధైర్యంగా ఎంతమంది అమ్మ ఒడి, అసరా పెన్షన్లు ఇచ్చారు.. ఇంకా ఎవరికి ఏమేమి ఇచ్చారో వెబ్సైట్లో పెట్టే దమ్ముందా? అని నిలదీశారు.
Read Also: Jharkhand: సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులపై ఈడీ రైడ్స్..
Also Read
జనవరిలో జాబ్ క్యాలెండర్ ఏమైంది? అని సీఎం జగన్ను ప్రశ్నించారు చంద్రబాబు.. యువతరానికి పంగనామాలు పెట్టారంటూ మండిపడ్డ ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చెత్త పరిపాలనగా అభివర్ణించారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, చేతలు గడప కూడా దాటడం లేదన్న ఆయన.. నాకు కేసులు కొత్తకాదన్నారు.. ఇప్పుడు పెగాసిస్ కేసు పెడుతాడట.. అసలు పెగాసిస్ అంటే ఎంటో జగన్ కు తెలుసా…? అని ఎద్దేవా చేశారు. ఇన్ఫర్మేషను టెక్నాలజీ గురించి నాకు చెబుతావా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరిలో చంద్రబాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రజానికం.. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అధికారంలోకి వచ్చాకా నగరి రూపురేఖలు మారుస్తా అన్నారు. నగరిలో యాబై వేలమంది చేనేత కార్మికులు ఉన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు యాబైశాతం కరెంట్ లో సబ్సిడీ ఇచ్చాను అని గుర్తుచేశారు. ఇక, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదువందల యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తానని ప్రటించారు. కానీ, వైసీపీ మాత్రం భారీగా కరెంట్ చార్జీలు పెంచింది… దానివల్ల చేనేత కార్మికులపై పెనుభారం పడిందన్నారు.. నగరినీ కాలుష్యరహితంగా మారుస్తాను… నగరిలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తాను అని హామీ ఇచ్చారు. మరోవైపు, డైనేజి కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడుతాడా…? అని ప్రశ్నించారు చంద్రబాబు.. కాలువ తవ్వలేని వ్యక్తి ప్రాజెక్టులు కడుతాడా…? అని సెటైర్లు వేశారు.. నా కష్టాన్ని బూడిదలో పోసినా పన్నీరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!