Chandrababu: రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకు పోతుందని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కోడుమూరులో మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో విజయ భాస్కర్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్నవ్యక్తి.. కానీ, అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోడుమూరు నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ సహా అన్ని నంద్యాల జిల్లాకు వెళ్లాయని ఆరోపించారు.. కర్నూల్ జిల్లాలో నీటి ఎద్దడి ఉంది.. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది టీడీపీయే అన్నారు.. మూడేళ్లలో ఒక్క పని చేశారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు కడతాడా? అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Risk of Hearing Loss: హెడ్ఫోన్స్ ఎఫెక్ట్.. 100 కోట్ల మందికి ముప్పు..!
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, అన్ని పన్నులు పెంచారు.. చివరికి చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.. పత్తి రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చి నష్టం చేశారన్న ఆయ.. సీఎం జగన్ ఒక్క రైతుతో మాట్లాడారా? దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉండేది మన రాష్ట్రంలోనే అని విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు కారణం సీఎం జగనేనని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రంలో సీఐడీ ఒక పనికి మాలిన శాఖగా మారిందన ఆరోపించారు. తప్పు చేసిన అధికారులను వదలం అని హెచ్చరించారు.. ఏదేమైనా రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైసీపీ కొట్టుకు పోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!