GVL Narasimha Rao: జీవీఎల్కి తృటిలో తప్పిన ప్రమాదం.. కుమ్మేందుకు ప్రయత్నించిన ఆవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bull Attacked On GVL Narasimha Rao In Guntur Mirchi Yard: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుకి తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరులోని మిర్చి యార్డులో ఆయన్ను కుమ్మేసేందుకు ప్రయత్నించింది. కట్టేసి ఉన్న ఆవుని తాకిన జీవీఎల్ను.. వెనుక కాలితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. అది కట్టేసి ఉండటంతో జీవీఎల్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన చుట్టూ జనం ఉండటంతో ఆ ఆవు కంగారు పడి ఉంటుందని, ఈ క్రమంలోనే జీవీఎల్ తాకినప్పుడు అది దాడి చేసి ఉంటుందని అంటున్నారు. ముందు వైపు నుండి కూడా ఆ ఆవు దాడి చేసేందుకు యత్నించింది.
Throat Cut: నార్సింగీ లో దారుణం.. గొంతుకోసి హత్య
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అంతకుముందు.. వైసీపీ, టీడీపీలపై జీవీఎల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీతో తమకు రాజ్యాంగబద్ధ సంబంధాలే ఉన్నాయని.. భవిష్యత్తులో వైసీపీకి బీజేపీ, జనసేన పార్టీలే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. టీడీపీ కనిపించకుండా పోతుందని జోస్యం చెప్పారు. పోలవరం మాదంటే మాదని వైసీపీ, టీడీపీలు ప్రగల్భాలు పలుకుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. విశాఖలో భూములు దోపిడికి గురవుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ అంశంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్షాలు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లకు కనీసం మరమ్మత్తులు కూడా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mandous Cyclone Live Updates: మాండూస్ విలయం.. లైవ్ అప్డేట్స్
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్ట్లు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని జీవీఎల్ కోరారు. తాను పుట్టిన రాయలసీమకు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఎలాంటి మేలు చేయలేదన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. ఇక వచ్చే ఏడాదికి విశాఖకు 5జీ సేవలు అందిస్తామని.. అలాగే వైజాగ్ నుంచి తిరుపతి, హైదరాబాద్, బెంగళూరుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని జీవీఎల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!