Thota Chandrasekhar: ఏపీలో బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Will Contest From All Constituencies In Andhra Pradesh Says Thota Chandrasekhar: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఆయన.. తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ డెవలప్మెంట్ మోడల్నే ఏపీలో అమలు చేస్తామని అన్నారు. ఏపీకి ఎన్నో సమస్యలున్నాయని.. బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఎంతో అన్యాయం చేసిందని ఆరోపించారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలోనూ కేంద్రం సహకారం రావడం లేదన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని, బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో కేసీఆర్ ముందుకొచ్చారని తెలిపారు.
Anakapalli Crimes: గుర్తు తెలియని శవాల కలకలం.. నెల రోజుల్లో రెండు హత్యలు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో ఎన్నో సమస్యలు తలెత్తాయని.. ఇంతవరకు రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని.. దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విజయవాడ, వైజాగ్ నగరాల్లో ఇప్పటికీ మెట్రో రైలు సౌకర్యం లేదన్న ఆక్ష్న.. దక్షిణాదిపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. వీటిపై కేంద్రాన్ని నిలదీసిన వాళ్లు ఎవరూ లేరని.. కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ఉందని.. ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ అవతరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని అన్నారు. దేశంలో స్వశక్తితో బీఆర్ఎస్ బలమైన పార్టీగా రాబోయే ఎన్నికల్లో చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Chhattisgarh: కొత్తగా పెళ్లైన జంట.. రిసెప్షన్కు ముందు కత్తిపోట్లతో మృతి.. అసలేం జరిగింది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..