Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భవిష్యత్లో జేఈఈ, నీట్లను సీయూఈటీలో విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ గత నెలలో ప్రకటించారు. ‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీఏ దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు.
దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. నీట్, జేఈఈ, సీయూఈటీతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని… మూడు పరీక్షల విలీనం, మిశ్రమ పరీక్షను నిర్వహించే భావనపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, విద్యార్థులు భయపడవద్దని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..
9వ తరగతి నుండి పుస్తకాలలో పెరుగుతున్న కంటెంట్పై విద్యార్థులు పోటీ పరీక్షల తయారీ కోసం ఇతర పుస్తకాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కొత్త విద్యా విధానం-2020 కింద కొత్త పుస్తకాలు వచ్చే రెండేళ్లలో వస్తాయని ప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిందని, ఇందులో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీల కోసం మల్టీ డిసిప్లినరీ కోర్సులను అభ్యసించవచ్చని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిటిజన్ సర్వే కోసం పుస్తకాలు, స్టడీ మెటీరియల్పై వారి సూచనలు ఇవ్వాలని విద్యార్థులను కోరిన మంత్రి, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పదివేల మంది విద్యార్థులు కోటాలోని అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రతి సంవత్సరం వివిధ పరీక్షల తయారీ కోసం నమోదు చేసుకుంటారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!