Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భవిష్యత్లో జేఈఈ, నీట్లను సీయూఈటీలో విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ గత నెలలో ప్రకటించారు. ‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీఏ దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు.
దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. నీట్, జేఈఈ, సీయూఈటీతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని… మూడు పరీక్షల విలీనం, మిశ్రమ పరీక్షను నిర్వహించే భావనపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, విద్యార్థులు భయపడవద్దని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read
Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..
9వ తరగతి నుండి పుస్తకాలలో పెరుగుతున్న కంటెంట్పై విద్యార్థులు పోటీ పరీక్షల తయారీ కోసం ఇతర పుస్తకాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కొత్త విద్యా విధానం-2020 కింద కొత్త పుస్తకాలు వచ్చే రెండేళ్లలో వస్తాయని ప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిందని, ఇందులో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీల కోసం మల్టీ డిసిప్లినరీ కోర్సులను అభ్యసించవచ్చని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిటిజన్ సర్వే కోసం పుస్తకాలు, స్టడీ మెటీరియల్పై వారి సూచనలు ఇవ్వాలని విద్యార్థులను కోరిన మంత్రి, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పదివేల మంది విద్యార్థులు కోటాలోని అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రతి సంవత్సరం వివిధ పరీక్షల తయారీ కోసం నమోదు చేసుకుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!