Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భవిష్యత్లో జేఈఈ, నీట్లను సీయూఈటీలో విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ గత నెలలో ప్రకటించారు. ‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీఏ దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు.
దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. నీట్, జేఈఈ, సీయూఈటీతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని… మూడు పరీక్షల విలీనం, మిశ్రమ పరీక్షను నిర్వహించే భావనపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, విద్యార్థులు భయపడవద్దని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read
Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..
9వ తరగతి నుండి పుస్తకాలలో పెరుగుతున్న కంటెంట్పై విద్యార్థులు పోటీ పరీక్షల తయారీ కోసం ఇతర పుస్తకాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కొత్త విద్యా విధానం-2020 కింద కొత్త పుస్తకాలు వచ్చే రెండేళ్లలో వస్తాయని ప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిందని, ఇందులో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీల కోసం మల్టీ డిసిప్లినరీ కోర్సులను అభ్యసించవచ్చని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిటిజన్ సర్వే కోసం పుస్తకాలు, స్టడీ మెటీరియల్పై వారి సూచనలు ఇవ్వాలని విద్యార్థులను కోరిన మంత్రి, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పదివేల మంది విద్యార్థులు కోటాలోని అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రతి సంవత్సరం వివిధ పరీక్షల తయారీ కోసం నమోదు చేసుకుంటారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!