Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భవిష్యత్లో జేఈఈ, నీట్లను సీయూఈటీలో విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ గత నెలలో ప్రకటించారు. ‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీఏ దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు.
దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. నీట్, జేఈఈ, సీయూఈటీతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని… మూడు పరీక్షల విలీనం, మిశ్రమ పరీక్షను నిర్వహించే భావనపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, విద్యార్థులు భయపడవద్దని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..
9వ తరగతి నుండి పుస్తకాలలో పెరుగుతున్న కంటెంట్పై విద్యార్థులు పోటీ పరీక్షల తయారీ కోసం ఇతర పుస్తకాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కొత్త విద్యా విధానం-2020 కింద కొత్త పుస్తకాలు వచ్చే రెండేళ్లలో వస్తాయని ప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిందని, ఇందులో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీల కోసం మల్టీ డిసిప్లినరీ కోర్సులను అభ్యసించవచ్చని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిటిజన్ సర్వే కోసం పుస్తకాలు, స్టడీ మెటీరియల్పై వారి సూచనలు ఇవ్వాలని విద్యార్థులను కోరిన మంత్రి, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పదివేల మంది విద్యార్థులు కోటాలోని అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రతి సంవత్సరం వివిధ పరీక్షల తయారీ కోసం నమోదు చేసుకుంటారు.
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్తో చిరంజీవి, రామ్ చరణ్కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!