Central Govt: వచ్చే రెండేళ్లలో ఆ ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. భవిష్యత్లో జేఈఈ, నీట్లను సీయూఈటీలో విలీనం చేస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ గత నెలలో ప్రకటించారు. ‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీఏ దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని కూడా చెప్పారు.
దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకింత ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు. నీట్, జేఈఈ, సీయూఈటీతో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని… మూడు పరీక్షల విలీనం, మిశ్రమ పరీక్షను నిర్వహించే భావనపై నిర్ణయం తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని, విద్యార్థులు భయపడవద్దని కేంద్ర మంత్రి చెప్పారు.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
Jobs Notification: మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..
9వ తరగతి నుండి పుస్తకాలలో పెరుగుతున్న కంటెంట్పై విద్యార్థులు పోటీ పరీక్షల తయారీ కోసం ఇతర పుస్తకాలను సంప్రదించాల్సిన అవసరం లేదని, కొత్త విద్యా విధానం-2020 కింద కొత్త పుస్తకాలు వచ్చే రెండేళ్లలో వస్తాయని ప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిందని, ఇందులో విద్యార్థులు డ్యూయల్ డిగ్రీల కోసం మల్టీ డిసిప్లినరీ కోర్సులను అభ్యసించవచ్చని మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ సిటిజన్ సర్వే కోసం పుస్తకాలు, స్టడీ మెటీరియల్పై వారి సూచనలు ఇవ్వాలని విద్యార్థులను కోరిన మంత్రి, వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పదివేల మంది విద్యార్థులు కోటాలోని అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రతి సంవత్సరం వివిధ పరీక్షల తయారీ కోసం నమోదు చేసుకుంటారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!