AP Employees: డీఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగుల రియాక్షన్!
- ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు..
- ఒక డీఏను ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చ..
- పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పారు: ఏపీ ఎన్జీఓ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ.. ప్రధాన ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.. గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చ జరిగింది.. నవంబర్ 2025 నుంచి ఒక డీఏ మంజూరు చేశారు.. అలాగే, హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇది బిగినింగ్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు.. పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పినట్లు ఎన్జీఓ నేత విద్యాసాగర్ చెప్పుకొచ్చారు.
Read Also: Blood Group Mismatch: వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకు ప్రమాదామా?
Also Read
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
ఇక, ఉద్యోగ సంఘం జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులు- ప్రభుత్వం వేరు కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.. కలిసి పని చేద్దాం, రాష్ట్రం పునర్నిర్మాణం చేద్దాం అని తెలిపారు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశం జరిగింది.. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్.. రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు.. అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు.. క్యాబినెట్ సబ్ కమిటీ కంటిన్యూగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also: Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
అలాగే, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర రావు మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా పెండింగులో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలు వెంటనే క్లీయర్ చేస్తూ జీఓ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడం పట్ల హర్షనీయం అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
-
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
-
NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్లో అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!