Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
- జూన్ 21న ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్
- ఫైనల్లో యువ సంచలనం వైభవ్ను టార్గెట్ చేస్తారా?
- శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని తాము ఆడమని స్పష్టం చేశాడు. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో అతడిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారా? అనే ప్రశ్నకు శ్రీలంక-ఏ కెప్టెన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
అఫ్గానిస్థాన్-ఏపై 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక-ఏ ఫైనల్కు చేరుకుంది.సహన్ అరచ్చిగే మాట్లాడుతూ… ‘మా ఆటగాళ్లు ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. మేము మా ఆటను ఆస్వాదిస్తున్నాం. సూపర్ ఓవర్ లాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో భావోద్వేగాలు బయటపడటం సహజం. అందులో అసాధారణం ఏమీ లేదు. అది జరిగిపోయిన ఘటన. మేం ఫైనల్పైనే దృష్టి పెట్టాము. గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
Also Read
- IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
- Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్గా రికార్డ్..
- Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
లీగ్ దశలో భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ భారత్ను గెలిపించలేకపోయాడు. ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా విషేన్ హలంబాగేతో వైభవ్కు వాగ్వాదం జరగగా.. ఇద్దరి మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫైనల్కు ముందు తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపాడు. ‘మా బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్లో కూడా పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మా జట్టు మంచి స్థితిలో ఉంది’ అని చెప్పాడు.
మరోవైపు మాజీ భారత కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ఇటీవల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టే ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఫైనల్లో వైభవ్ ఎలా రాణిస్తాడు?. లీగ్ మ్యాచ్లో జరిగిన ఘటనకు బ్యాట్తో సమాధానం ఇస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. డంబుల్లా క్రికెట్ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!