Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
- జూన్ 21న ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్
- ఫైనల్లో యువ సంచలనం వైభవ్ను టార్గెట్ చేస్తారా?
- శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని లక్ష్యంగా చేసుకుని తాము ఆడమని స్పష్టం చేశాడు. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో వైభవ్, శ్రీలంక ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో అతడిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తారా? అనే ప్రశ్నకు శ్రీలంక-ఏ కెప్టెన్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
అఫ్గానిస్థాన్-ఏపై 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన శ్రీలంక-ఏ ఫైనల్కు చేరుకుంది.సహన్ అరచ్చిగే మాట్లాడుతూ… ‘మా ఆటగాళ్లు ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. మేము మా ఆటను ఆస్వాదిస్తున్నాం. సూపర్ ఓవర్ లాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ల్లో భావోద్వేగాలు బయటపడటం సహజం. అందులో అసాధారణం ఏమీ లేదు. అది జరిగిపోయిన ఘటన. మేం ఫైనల్పైనే దృష్టి పెట్టాము. గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం’ అని తెలిపాడు.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
లీగ్ దశలో భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరి మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ భారత్ను గెలిపించలేకపోయాడు. ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా విషేన్ హలంబాగేతో వైభవ్కు వాగ్వాదం జరగగా.. ఇద్దరి మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫైనల్కు ముందు తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే తెలిపాడు. ‘మా బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి సమస్య లేదు. బౌలింగ్లో కూడా పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మా జట్టు మంచి స్థితిలో ఉంది’ అని చెప్పాడు.
మరోవైపు మాజీ భారత కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ ఇటీవల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టే ప్రత్యేక ఆకర్షణను సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడు ఫైనల్లో వైభవ్ ఎలా రాణిస్తాడు?. లీగ్ మ్యాచ్లో జరిగిన ఘటనకు బ్యాట్తో సమాధానం ఇస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. డంబుల్లా క్రికెట్ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!