Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక దృష్టి సారించింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆమె పేర్కొన్న తేదీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సిబ్బందిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం పూర్తిస్థాయిలో విచారిస్తోంది. సాయికృష్ణ తల్లి చెబుతున్న తేదీల్లో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బంది ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు విధుల్లోకి వస్తారు అనే సమాచారాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు.
అంతేకాకుండా, మే నెలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను బ్యాకప్ చేయాలని స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు, సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేసులో కృష్ణలంక స్వర్గపురిలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. సాయికృష్ణను హత్య చేసి అక్కడే దహనం చేశారని అతని తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్వర్గపురి ప్రాంతాన్ని పరిశీలించారు.
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
విచారణ సందర్భంగా స్వర్గపురిలోని సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని అక్కడి సిబ్బందిని పోలీసులు కోరారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని సిబ్బంది తెలిపారు. మే 20 నుంచి మే 29 వరకు ఏవైనా ఫుటేజ్లు అందుబాటులో ఉంటే ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ, అలాంటి రికార్డులు లేవని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. దీంతో సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ట్రంప్తో జిన్పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!