AP Employees: డీఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగుల రియాక్షన్!
- ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు..
- ఒక డీఏను ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చ..
- పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పారు: ఏపీ ఎన్జీఓ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ.. ప్రధాన ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.. గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై చర్చ జరిగింది.. నవంబర్ 2025 నుంచి ఒక డీఏ మంజూరు చేశారు.. అలాగే, హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇది బిగినింగ్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు.. పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక తనకు వదిలేయాలని చంద్రబాబు చెప్పినట్లు ఎన్జీఓ నేత విద్యాసాగర్ చెప్పుకొచ్చారు.
Read Also: Blood Group Mismatch: వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకు ప్రమాదామా?
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ఇక, ఉద్యోగ సంఘం జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులు- ప్రభుత్వం వేరు కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.. కలిసి పని చేద్దాం, రాష్ట్రం పునర్నిర్మాణం చేద్దాం అని తెలిపారు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమావేశం జరిగింది.. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్.. రిటైర్ అయ్యే వరకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు.. అనేక అంశాల్లో స్పష్టత ఇచ్చారు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు.. క్యాబినెట్ సబ్ కమిటీ కంటిన్యూగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also: Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
అలాగే, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర రావు మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా పెండింగులో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలు వెంటనే క్లీయర్ చేస్తూ జీఓ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడం పట్ల హర్షనీయం అన్నారు.
తాజావార్తలు
-
Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
-
Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
-
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..