AP Reorganisation : రేపు పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026
- అమరావతికి చట్టబద్ధ గుర్తింపు దిశగా అడుగు
- లోక్సభలో రేపు సవరణ బిల్లు ప్రవేశం
- రాజధాని అనిశ్చితికి ముగింపు సంకేతాలు
- పెట్టుబడిదారుల్లో పెరిగే నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం, పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని ఏర్పాటు చేసుకునే వీలుంది. అయితే, చట్టంలో ఉన్న సాంకేతిక అంశాలను సవరిస్తూ, ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ అని స్పష్టంగా పేర్కొంటూ ఈ సవరణ చేయబోతున్నారు. దీనివల్ల అమరావతికి ఒక స్థిరమైన రూపం ఏర్పడటమే కాకుండా, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి రాజకీయ అనిశ్చితులకు తావు లేకుండా పోతుంది.
Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
రేపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సుమారు గంట పాటు చర్చ జరగనుంది. అనంతరం లోక్సభ ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. రేపు లేదా ఎల్లుండి (ఏప్రిల్ 2) కల్లా రాజ్యసభలో కూడా చర్చ ముగిసి బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించనుంది. రాజధానిపై స్పష్టత లేకపోవడంతో గత కొన్నేళ్లుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకాడారు. ఇప్పుడు కేంద్రం నేరుగా చట్ట సవరణ చేస్తుండటంతో, అంతర్జాతీయ సంస్థలు , పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగనుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి , మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!