Andhra Pradesh: సలహాదారుల నియామకంపై హైకోర్టు సీరియస్.. ఐఏఎస్ల కంటే గొప్ప సలహాలిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా తేలుస్తామని హైకోర్టు తెలిపింది.
Read Also: Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
Also Read
కాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు.. ప్రభుత్వ శాఖల వారీగా ఎంతమందిని నియమించారు.. ఈ విషయంలో విధి విధానాలేంటి అన్న పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. ఓ పీఠాధిపతి సలహా మేరకు పిటిషనర్ జ్వాలాపురపు శ్రీకాంత్ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమించామని ఏజీ ఇచ్చిన వివరణను తప్పుబట్టింది. పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని.. వారు దేవాలయాల వ్యవహారాలకే పరిమితం కావడం ఉత్తమమని వ్యాఖ్యానించింది. ఇష్టానుసారంగా సలహాదారుల నియామక విషయం చిన్నదేమీ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
-
OTR: వైజాగ్ పాలిటిక్స్లో తన ముద్ర కోసం శ్రీభరత్ తిప్పలు.?
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
-
OTR: కదిరి వైసీపీలో కోవర్ట్ కలకలం.. పార్టీని దెబ్బతీస్తున్నది సొంత నేతలేనా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!