Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది. ఆప్ ఎన్నికల వ్యూహకర్త సందీప్ పాఠక్ పార్టీ రాజస్థాన్ యూనిట్ నాయకులు, వాలంటీర్లతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆప్ విజయాన్ని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. రాజస్థాన్లో ఆప్ ఎన్నికల ఇన్ఛార్జి వినయ్ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆప్ను బలోపేతం చేసేందుకు పార్టీ చేయాల్సిన పనులపై సమీక్షించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.
Jagadish Reddy : బీఆర్ఎస్ సంక్షేమంలో దేశ దిశను మారుస్తుంది
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
పంజాబ్లో అద్భుతమైన విజయం సాధించిన వెంటనే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ రాజస్థాన్లో తన స్థావరాన్ని బలోపేతం చేసుకోవడానికి మెగా కసరత్తు ప్రారంభించింది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గత 8 నెలల్లో రాజస్థాన్లో ఆప్ రాష్ట్ర యూనిట్ ఇప్పటివరకు చేసిన పనులను సమీక్షించామని ఆప్ సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ కూడా రాజస్థాన్లోని పార్టీ నాయకులు, వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకున్నారని పార్టీ నాయకుడు వెల్లడించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!