Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనడం ఖాయమనిపిస్తోంది. ఆప్ ఎన్నికల వ్యూహకర్త సందీప్ పాఠక్ పార్టీ రాజస్థాన్ యూనిట్ నాయకులు, వాలంటీర్లతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఆప్ విజయాన్ని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు. రాజస్థాన్లో ఆప్ ఎన్నికల ఇన్ఛార్జి వినయ్ మిశ్రా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆప్ను బలోపేతం చేసేందుకు పార్టీ చేయాల్సిన పనులపై సమీక్షించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.
Jagadish Reddy : బీఆర్ఎస్ సంక్షేమంలో దేశ దిశను మారుస్తుంది
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
పంజాబ్లో అద్భుతమైన విజయం సాధించిన వెంటనే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ రాజస్థాన్లో తన స్థావరాన్ని బలోపేతం చేసుకోవడానికి మెగా కసరత్తు ప్రారంభించింది. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గత 8 నెలల్లో రాజస్థాన్లో ఆప్ రాష్ట్ర యూనిట్ ఇప్పటివరకు చేసిన పనులను సమీక్షించామని ఆప్ సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ కూడా రాజస్థాన్లోని పార్టీ నాయకులు, వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి, ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకున్నారని పార్టీ నాయకుడు వెల్లడించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..