YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలువుతున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, జైలుకు పంపిన తీరు రాష్ట్రంలో బాధితులే నిందితులుగా మారుతున్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ, చివరకు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ధ్వంసం చేసి అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్రల పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. రాత్రి 2:45 గంటల సమయంలో వందల మంది పోలీసులు దొంగల్లా, బందిపోటు ముఠాలా వచ్చి ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి డోర్లు, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆయనను అపహరించుకుపోయారని ఆరోపించారు. పగటిపూట నోటీసులు ఇస్తే రాని ఉగ్రవాదా ఆయన అని ప్రశ్నించారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన కుమారుడు, తమ్ముడు, తమ్ముడి కుమారుడిని కూడా ఈ కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు.
Also Read
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
ఆగష్టు 1న సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిపై దాడి జరుగుతుంటే, ఆయన రక్షణ కోసం ఎమ్మెల్యే విరూపాక్షి మానవత్వంతో అక్కడికి వెళ్లడమే నేరమన్నట్లు పోలీసులు వ్యవహరించారని జగన్ తెలిపారు. స్థానిక ఎస్సై, సీఐలకు ఫోన్ చేసినా పోలీసులు కాపాడకపోవడంతోనే ఎమ్మెల్యే స్వయంగా వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత నెమకల్లు వద్ద ఎమ్మెల్యేపై దాడి చేసి, ఆయన తమ్ముడి చెయ్యి విరగ్గొట్టారని వెల్లడించారు.
ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలు తానే చించి, ఆ నెపం ఎమ్మెల్యేపై నెట్టి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయని, సదరు మహిళతో తప్పుడు మాటలు చెప్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ఈ అక్రమాలపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలని జగన్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!