Minister Ramprasad Reddy: ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేశారు..?
- రాష్ట్రంలో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది..
- లక్షన్నర ఎకరాల భూమిని వాళ్లు కబ్జా చేశారు..
- అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక ఉన్నారు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.. పెద్ద ఎత్తున 22ఏ భూముల రికార్డులు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ధ్వసం చేసారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయట పడతాయని రికార్డులను కాల్చేశారు అని ఆరోపణలు గుప్పించారు. అనేక మంది అధికారులు పెద్దిరెడ్డి కోసం పని చేశారు.. ఆ అధికారులే భూ రికార్డులను కాల్చివేతకు పాల్పడ్డారు.. మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డ్స్ కాల్చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read Also: CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
ఇక, అనేక మంది బాధితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ దోపిడీ పైన ఫిర్యాదులు చేస్తున్నారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలను భయపెట్టి పెద్దిరెడ్డి పె ద్దఎత్తున దోపిడీ చేశారు.. రూ. 40 వేల కోట్ల భూ అక్రమాలు గత ప్రభుత్వం హయాంలో జరిగాయి.. భద్రత కోసం కూడా పెద్దిరెడ్డి కుటుంబం చిల్లర రాజకీయాలు చేస్తుంది.. కావాలనే దాడులు సృష్టించుకొని, పోలీసుల వైఫ్యలం పేరుతో డ్రామా ఆడుతున్నారు.. పరదాల ముఖ్యమంత్రి పాలన పోయి.. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చింది.. 60 రోజులు నుంచి రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది.. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. మదనపల్లి ఘటనపై మాజీ సీఎం జగన్ చర్చకు ఎక్కడకు వచ్చిన మేం సిద్ధంగా ఉన్నాం.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు
గన్ మాన్లను తొలగించారు అని రాంప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!