John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్ను పరిశీలిస్తే యాక్షన్ థ్రిల్లర్లకు ఆయన ఎంతగా సరిపోతారో అర్థమవుతుంది. ‘ఫోర్స్’, ‘ధూమ్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న జాన్, తర్వాత కూడా ఇదే జానర్లో అనేక సినిమాలు చేశారు. ఇప్పుడు జాన్ అబ్రహం మరో డబుల్ రోల్ యాక్షన్ థ్రిల్లర్లో నటించే అవకాశం ఉందనే వార్త బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ దర్శకుడు శివమ్ నాయర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో యాక్షన్, స్పై థ్రిల్లర్ చిత్రాలకు పేరుగాంచిన ఈ దర్శకుడు ‘ఆహిస్తా ఆహిస్తా’ (2006) సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ‘భాగ్ జానీ’ (2015) చిత్రాలను తెరకెక్కించారు. తాప్సీ పన్ను లీడ్ రోల్లో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘నామ్ శబానా’ (2017) (తెలుగులో ‘నేనే శబానా’) చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించగా, ఇటీవల జాన్ అబ్రహం హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా ‘ది డిప్లొమాట్’ (2025) అనే పొలిటికల్ థ్రిల్లర్ను కూడా రూపొందించారు. మారోసారి ఈ కాంబో పట్టాలెక్కబోతుండగా, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉందని, కథకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త చిత్రంలో జాన్ అబ్రహంతో పాటు నటించబోయే మరో హీరో ఎవరు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
ఇదిలా ఉంటే జాన్ అబ్రహం చేతిలో ఇప్పటికే రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘రాకేష్ మరియా’లో ఆయన నటించనున్నారు. అలాగే ఆయన కెరీర్లో కీలకమైన యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫోర్స్ 3’ కూడా రాబోతోంది. ఈ చిత్రంలో జాన్తో పాటు హర్షవర్ధన్ రాణే నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో ‘ఫోర్స్ 3’ కూడా డబుల్ హీరో యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు శివమ్ నాయర్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త సినిమా కూడా డ్యూయల్ హీరో యాక్షన్ కథ కావడం ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాన్ అబ్రహం, శివమ్ నాయర్ కాంబినేషన్పై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే మాత్రం, జాన్ అబ్రహం అభిమానులకు మరో భారీ యాక్షన్ ట్రీట్ సిద్ధమైనట్టే.
- Tags
- cinema
- John Abraham
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!