John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్ను పరిశీలిస్తే యాక్షన్ థ్రిల్లర్లకు ఆయన ఎంతగా సరిపోతారో అర్థమవుతుంది. ‘ఫోర్స్’, ‘ధూమ్’ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న జాన్, తర్వాత కూడా ఇదే జానర్లో అనేక సినిమాలు చేశారు. ఇప్పుడు జాన్ అబ్రహం మరో డబుల్ రోల్ యాక్షన్ థ్రిల్లర్లో నటించే అవకాశం ఉందనే వార్త బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ దర్శకుడు శివమ్ నాయర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. హిందీ సినీ పరిశ్రమలో యాక్షన్, స్పై థ్రిల్లర్ చిత్రాలకు పేరుగాంచిన ఈ దర్శకుడు ‘ఆహిస్తా ఆహిస్తా’ (2006) సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ‘భాగ్ జానీ’ (2015) చిత్రాలను తెరకెక్కించారు. తాప్సీ పన్ను లీడ్ రోల్లో వచ్చిన సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ ‘నామ్ శబానా’ (2017) (తెలుగులో ‘నేనే శబానా’) చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించగా, ఇటీవల జాన్ అబ్రహం హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా ‘ది డిప్లొమాట్’ (2025) అనే పొలిటికల్ థ్రిల్లర్ను కూడా రూపొందించారు. మారోసారి ఈ కాంబో పట్టాలెక్కబోతుండగా, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉందని, కథకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త చిత్రంలో జాన్ అబ్రహంతో పాటు నటించబోయే మరో హీరో ఎవరు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
ఇదిలా ఉంటే జాన్ అబ్రహం చేతిలో ఇప్పటికే రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న ‘రాకేష్ మరియా’లో ఆయన నటించనున్నారు. అలాగే ఆయన కెరీర్లో కీలకమైన యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫోర్స్ 3’ కూడా రాబోతోంది. ఈ చిత్రంలో జాన్తో పాటు హర్షవర్ధన్ రాణే నటిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. దీంతో ‘ఫోర్స్ 3’ కూడా డబుల్ హీరో యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు శివమ్ నాయర్ దర్శకత్వంలో రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త సినిమా కూడా డ్యూయల్ హీరో యాక్షన్ కథ కావడం ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జాన్ అబ్రహం, శివమ్ నాయర్ కాంబినేషన్పై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే మాత్రం, జాన్ అబ్రహం అభిమానులకు మరో భారీ యాక్షన్ ట్రీట్ సిద్ధమైనట్టే.
- Tags
- cinema
- John Abraham
తాజావార్తలు
-
TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
-
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
-
Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
-
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
-
Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!