ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు… ఇవాళ పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 90,204 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 15 మంది మృతిచెందారు..
read also : మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా అదే ఫీలింగ్లో ఉన్నారా?
మరోవైపు.. 24 గంటల్లో 3,329 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,684 కు చేరుగా.. ఇప్పటి వరకు 13,057 మంది మృతి చెందారు.. రికవరీ కేసులు 18,87,670 కు పెరగగా.. ప్రస్తుతం 25,957 యాక్టివ్ కేసులు ఉన్నాయి.