‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా సబ్ జైలులో 23 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్పై జైలు నుండి విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ప్రజాపోరాటాలు చేయడం సహజమని, కానీ తమపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పిల్లలను, కుటుంబాలను లాగడం అత్యంత దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని కూటమి నాయకులు కుట్రపూరితంగా హత్యాయత్నం కేసుగా చిత్రీకరించి, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీవ్ర అభద్రతా భావంతో ఉంటూ, తనపై కక్ష తీర్చుకోవడానికి తన కుమారుడి భవిష్యత్తును బలిచేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో మాట్లాడి, తన అనుభవాన్ని తప్పుడు కేసులకు ఉపయోగించారని ఆరోపించారు. ఈ అన్యాయంపై మత్స్యకార సామాజికవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు లభించిన ప్రజా మద్దతు, ప్రజలలో వ్యక్తమవుతున్న తిరుగుబాటుకు సజీవ నిదర్శనమని చెప్పారు. ప్రారంభంలో తనకు కొంత నిరాశ భావం ఉన్నప్పటికీ, జైలు ములాఖాత్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలిసి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.
ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పర్యటన నిర్ణయం, లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు ఎంతో గర్వాన్ని, కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పేరాడ తిలక్, ఆమదాలవలస ఇంచార్జ్ చింతాడ రవికుమార్లపై కూడా తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడనని, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!