Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling Case: అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పి. నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. చంద్రబాబు, పి. నారాయణపై 2021లో నమోదైన క్రిమినల్ కేసును జూలై 15న ఏపీ హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. 2021 మార్చి 12న ఏపీ సీఐడీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి జీవోలు జారీ చేయడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ను తిరస్కరించింది. ఇక, అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించిన ఈ తీర్పు ఇతర కేసులపై ప్రభావం చూపదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయా కేసులను వాటి స్వంత మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలని పేర్కొంది. దీంతో ఇతర కేసుల్లోని అంశాలను ఈ తీర్పుతో ముడిపెట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసినట్లయింది.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయ పోరాటాలను కోర్టులో చేయొద్దు
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో న్యాయస్థానం అవసరమైన రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పోరాటాలను కోర్టుల వేదికగా చేయకూడదని వ్యాఖ్యానించారు. రైతుల హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, అయితే రాజకీయ వివాదాలను న్యాయపరమైన పోరాటాలుగా మార్చడం సరికాదని సూచించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!