Taneti Vanitha: వరద బాధితుల్ని ఆదుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరద బాధితుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు హోంమంత్రి తానేటి వనిత. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ముంపు గ్రామమైన యలమంచిలిలంకలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాసు లతో ఏటిగట్టు నుంచి ఊరు లోపలికి కొంత దూరం పడవ ప్రయాణించి బాధిత మహిళలతో మాట్లాడారు. ఇంకా 24 గంటల పాటు వరద పెరిగే సూచనలు ఉన్నాయని అంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ముంపు గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఎట్టి పరిస్థితులు సంభవించిన వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, వారికి కావలసిన నిత్యావసర మందులు భోజనం ఏర్పాట్లు సరిగా చూసుకోవాలని స్థానిక అధికారులను కోరారు
మరోవైపు ఆచంట మండలం భీమలాపురంలో వరద ఉధృతికి కొట్టుకునిపోయిన దేవి ముత్యాలమ్మ కుటుంబాన్ని పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు. ఏటి గట్టున అనుకుని ఉన్న 82 కుటుంబాలకు రెండు మరపడవలు, NDRF టీం,వీరి కోసం వివిధ శాఖలకు చెందిన 100 మంది ఉద్యోగస్తులను నియమించామని అన్నారు. ముంపు గురైన బాధితులను మూడు రోజుల నుండి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరినట్టు చెప్పారు. ముత్యాలమ్మ కుటుంబ సభ్యులు సహకరించి ఉంటే.. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని ఆయన కోరారు. బాధితులకు మెరుగైన ఆహార వసతులు కల్పించాం అన్నారు. విపత్తును ఎదుర్కునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసామని .వరద ఉధృతి దృష్ట్యా అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించారని అధికారిపై మాజీ మంత్రి శ్రీ రంగనాథ రాజు మండిపడ్డారు.
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
ఆచంట మండలం కోడేరులో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, కలెక్టర్ పి. ప్రశాంతి పర్యటించారు. వరద బాధితులకు ప్రభుత్వం నుండి అందుతున్న సహాయ సహకారాలు గురించి అధికారులును అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆచంట మండలం లంక గ్రామాల్లో వరద ముంపు గురైన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, పాలు, బియ్యం,మంచి నీరు ఎప్పటికప్పుడు లంక వాసులు ఇబ్బంది పడకుండా అందిస్తున్నాం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో లంక గ్రామాల నుండి ప్రజలను తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ బృందాలు ఏర్పాటు చేశాం. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో మనకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Montana Pileup: ధూళి తుపాను కారణంగా 21 వాహనాలు ఢీ.. ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!