JC Prabhakar Reddy: మమ్మల్ని 30 రోజులు ఫ్రీగా వదిలేయండి సీఎం గారు.. వాళ్ళ సంగతి చూస్తాం..
- చంద్రబాబు అతి మంచితనం వల్లనే వైసీపీ నేతలు రోడ్లపై తిరుగుతున్నారు..
- రివెంజ్ తీసుకోవాలని ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడికి లేదు..
- చంద్రబాబు గారు ఒక్క 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy: చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్లపై తిరుగుతున్నారు అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మా చేతులను కట్టేశారు.. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడినా రాష్ట్రాభివృద్ధి కావాలనే ఆలోచనతో చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోవడం లేదు.. నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి మైకులు కూడా లాక్కున్నారు.. ఇవన్నీ చంద్రబాబు మర్చిపోయాడు, రివెంజ్ తీసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదు.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చీము-నెత్తురు లేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకవైపు మేము వస్తే.. టీడీపీ వాళ్ళను ఊరు విడిపిస్తామని అంటున్నా, కనీసం రాష్ట్రంలో టీడీపీ నాయకులు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Suhas: అంబాజీపేట హీరోయిన్ తో మరో సినిమా
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
అయితే, వైఎస్ఆర్సీపీ నాయకులను ఉతికి ఆరేయండి అని టీడీపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, మాజీ మంత్రి పేర్ని నాని, దేవినేని అవినాష్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిలపై ఫైర్ అయ్యారు. పేర్ని నాని నీ భార్యను తిట్టారని అంటున్నావు.. మరి నా భార్య, కోడలుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించలేదా! అని ప్రశ్నించారు. చంద్రబాబు మాకు అండగా లేడు.. గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయకూడదని ఆయన ఆలోచన చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్
ఇక, చంద్రబాబు ఒక 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేయండి, ఎవరు ఏం మాట్లాడతారో చూస్తామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లను గత ఐదేళ్లు చెడగొట్టి పోయారు, వాటిని సీఎం సరి చేస్తున్నాడు అన్నారు. పేర్ని నాని పేదల బియ్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించావు నువ్వా మాట్లాడేది అని మండిపడ్డారు. వైసీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాడు, టీడీపీ వాళ్లకు అండగా లేడు అని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా గెలిచి మీకు అండగా నిలిచాడు లేకపోతే మీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని జేసీ ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో