CM Chandrababu: నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..
- విశాఖ: నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..
- మృతుల కుటుంబాలు.. గాయపడ్డవారిని పరామర్శించనున్న సీఎం..
- పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్న చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17 చేరింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. ఇక, గాయపడిన వారిని అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఫార్మా సెజ్ లోని ఎసైన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించనున్నారు. అలాగే, ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు.
Read Also: Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్, మను బాకర్ సంపాదన!
Also Read
అయితే, ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణం అని పోలసులు అంటున్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్ తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం కాగా.. యాజమాన్యం బాధ్యతారాహిత్యం ప్రమాదానికి కారణం అని పేర్కొన్నారు. 381 మంది సిబ్బంది పరిశ్రమలో పని చేస్తున్నారు. ఇక, యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక, ఫార్మా ప్రమాదంపై పోలీసులు ఎసైన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 106(1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు పెట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో మరణాలకి కారణం , ప్రాణాలకు, వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం లాంటి సెక్షన్ల కింద రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!