Brand Value: కంపెనీల క్యూ.. ఒక్కసారిగా పెరిగిన వినేశ్, మను బాకర్ సంపాదన!
- పెరిగిన వినేశ్ బ్రాండ్ విలువ
- 25 లక్షల నుంచి కోటి
- మను పారితోషకం 1.5 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనూహ్య రీతిలో పతకానికి దూరమైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో ఫైనల్ బౌట్కు ముందు 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే పతకం కోల్పోయినా ఆమెకు దేశవ్యాప్తంగా ఎంతో మద్దతు లభించింది. స్వదేశానికి వచ్చినపుడు అపూర్వ స్వాగతం దక్కింది. ఇప్పుడు వినేశ్ బ్రాండ్ విలువ కూడా ఒక్కసారిగా పెరిగింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫొగాట్ పారితోషకం నాలుగు రెట్లు పెరిగిందట. ఒక్కో ప్రకటనకు గతంలో రూ.25 లక్షలు పారితోషకం తీసుకున్న వినేశ్కు ఇప్పుడు ఏకంగా రూ.కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన యువ షూటర్ మను బాకర్ బ్రాండ్ విలువ కూడా భారీగా పెరిగింది. గతంలో ఒక్కో ప్రకటనకు రూ.25 లక్షలు తీసుకున్న మను పారితోషకం రూ.1.5 కోట్లకు చేరుకుందట. ఈ ఇద్దరి కోసం పలు కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
Also Read: Rohit Sharma: ఆ ముగ్గురి మద్దతుతో ప్రపంచకప్ గెలిచాం: రోహిత్
టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించి బ్రాండ్ల ఫేవరెట్గా మారిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్లో రజతానికే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ నీరజ్ పారితోషకం 30 శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్స్ తర్వాత ఈ ముగ్గురు చాలా ప్రకటనలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!