YSRCP Boycott PAC Elections: పాకిస్థాన్లో కూడా ఇలా లేదు.. పీఏసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..
- పీఏసీ ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ..
- గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు..
- ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే పీఏసీ ఇవ్వాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Boycott PAC Elections: పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు పీఏసీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు పెద్దిరెడ్డి.
Read Also: Ram Gopal Varma: ఆర్జీవీ పిటిషన్లపై విచారణ వాయిదా.. అన్ని కలిపి ఒకేసారి..!
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
ఇక, పీఏసీ అన్ని తప్పిదాలనూ ఎత్తి చూపుతుంది.. పాకిస్థాన్ సహా అన్ని దేశాల్లో పీఏసీ ప్రతిపక్షానిదే అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గతంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చింది పీఏసీయే అని వెల్లడించారు.. బోఫోర్స్ కుంభకోణం వెలికి తీసింది కూడా పీఏసీనే.. 2G స్పెక్ట్రమ్ కూడా మనోహర్ జోషీ వెలికి తీశారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో కుంభకోణాలు కూడా 2010లో PAC వెలికి తీసింది.. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా గీతారెడ్డికి PAC ఇచ్చారు.. 2019లో మేం PAC చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కి ఇచ్చాం.. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుంది..? అని ప్రశ్నించారు.. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి పక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం.. అందుకే PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామని ప్రకటించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇక, ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!