YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సంచలనంగా మారిన సుగాలి ప్రీతి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని ఆయన విమర్శించారు. 2017లో పదో తరగతి చదువుతున్న అమాయక బాలిక సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని గుర్తు చేసిన జగన్, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసలు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జగన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. సీబీఐ సిబ్బంది, వనరుల కొరత ఉందని చెబుతున్నా, దర్యాప్తుకు అవసరమైన సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో బాధిత కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా నిలిపేశారని తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
సిట్ రిపోర్టు, CDFD ల్యాబ్ నివేదికలు, డీఎన్ఏ ప్రొఫైల్ వివరాలు వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ ద్వారా సమగ్ర దర్యాప్తు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశ్నించారు వైఎస్ జగన్.. న్యాయం కోసం మరోసారి తమను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు వైసీపీ పూర్తి అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున సంపూర్ణ న్యాయ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!