AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలను కూలీ స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘PMFME–స్త్రీనిధి’ అనుసంధాన పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ద్వారా అర్హులైన డ్వాక్రా మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
రూ.3 లక్షల వరకు స్త్రీనిధి రుణం
ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. స్త్రీనిధి రుణంతో పాటు కేంద్ర ప్రభుత్వ PMFME పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా అందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు తమకు అనుకూలమైన ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
డ్వాక్రా మహిళలను కేవలం కూలీలుగా కాకుండా సొంతంగా ఉపాధి కల్పించుకునే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అర్హుల గుర్తింపునకు జిల్లా సమాఖ్యలు
పథకానికి అర్హులైన డ్వాక్రా మహిళలను గుర్తించేందుకు జిల్లా సమాఖ్యలను ‘డిస్ట్రిక్ట్ రిసోర్స్ ఆర్గనైజేషన్లు’ (DROs)గా వినియోగించనున్నారు. అర్హత ఉన్న మహిళలను గుర్తించడం, వారికి అవసరమైన సహకారం అందించడం వంటి అంశాల్లో జిల్లా స్థాయిలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి మార్కెటింగ్ వరకు సహకారం
రుణం అందించడంతో ప్రభుత్వం బాధ్యత ముగియదని అధికారులు చెబుతున్నారు. మహిళలు ఏర్పాటు చేయబోయే యూనిట్లకు అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, సాంకేతిక మార్గదర్శకత్వం, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ పూర్తి సహకారం అందించనున్నారు. తద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి, వ్యాపారాలను స్థిరంగా కొనసాగించేలా తోడ్పాటు అందించనున్నారు.
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం
ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్ పరంగా అండగా నిలిచేలా PMFME–స్త్రీనిధి అనుసంధాన పథకాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!