Srisailam: ప్రముఖ శైవక్షేత్రంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది.. శ్రీశైలం టోల్గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను…
Nellore Crime: నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. విక్రయాలకు అడ్డుగా ఉన్నాడంటూ స్థానిక సీపీఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో.. వేటాడి వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను అత్యంత కిరాతకంగా కత్తులతో హతమార్చారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.. అయితే, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు పై కూడా గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పోలీసులు…
విశాఖలో ఓ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ వార్తల్లోకి ఎక్కింది. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ప్రేమ, ప్రేయసి కోసం చాకుతో దాడికి పాల్పడి హత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. విశాఖ 3 టౌన్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోగాపురానికి చెందిన సూర్య, చైతన్య ఇద్దరు కాలేజ్ మెట్స్. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లగా ప్రేమ వ్యవహారం నడిచింది. 5 ఏళ్ళ…
Guntur Drugs: గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్ లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్. గుంటూరుకు చెందిన ఖాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి…
అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమే కానీ, డబ్బు సంపాదించేందుకు మానవ అవయవాలతో వ్యాపారం చేయడం తప్పే కదా. అమాయకులకు డబ్బు ఎరగా చూపి దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు సంచలనం సృష్టిస్తోంది. నిందితుల రిమాండ్ రిపొర్టు లో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రెండు అక్రమ కిడ్నీ ఆపరేషన్లను గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఒక్కో కిడ్నీ నీ పాతిక లక్షల అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు.…
Anantapur: పరకామణి కేసులో కీలక సాక్షి అయిన మాజీ ఆర్వీఎస్ఓ సతీష్ కుమార్ హత్యపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. హరి ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ పోలీసులు 103(1)BNS సెక్షన్ కింద కేసు ఫైల్ చేశారు.
Vijayawada Drugs Case: విజయవాడలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిని నిందితుడిగా చేర్చారు పోలీసులు.. ఈ కేసులో ఏ5గా కొండారెడ్డి పేరును చేర్చారు మాచవరం పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ఏ6 మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో బయటపడ్డ వివరాల ఆధారంగా కొండారెడ్డి పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది. కొండారెడ్డికి డ్రగ్స్ కొనుగోలులో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలినట్టు…
Madanapalle Kidney Racket: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖపట్నం నుంచి మదనపల్లికి మహిళలను తీసుకొచ్చిన కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. విశాఖకు చెందిన ఇద్దరు మహిళల కిడ్నీలను మదనపల్లిలో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అయితే.. కిడ్నీ తొలగించడంతో యమున అనే మహిళ మృతి చెందింది. యమున కుటుంబ సభ్యులు మదనపల్లి టూటౌన్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: Dubai: దుబాయ్ ఎడారిలో…
AP Crime: ఆంధ్రప్రదేశ్లో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురంలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది.. స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థిని రంజిత (10) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. ఈ ఘటన రామచంద్రపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. రంజిత తన గదిలో ఉరివేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందినప్పటికీ, తల్లి సునీత మాత్రం ఇది ఆత్మహత్య కాదని, ఎవరో చంపి ఫ్యాన్కి వేలాడదీశారని…