Vangalapudi Anitha: జగన్పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
- వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ హోం మంత్రి అనిత..
- ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు..
- ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు..
- జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది.. అలాగే రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉండాలి.. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే 175 మందికే అధ్యక్షా అనే అవకాశం వచ్చిందన్నారు.. అయితే, జగన్ వారి పార్టీ వ్యవహారాలు చూస్తుంటే రాజకీయాలు దిగజారాయా అనిపిస్తుంది.. కనీసం, మానవత్వం లేకుండా హింసకు ప్రేరేపించి అరాచకం సృష్టించారని ఫైర్ అయ్యారు.. జగన్ తన పల్నాడు పర్యటనలో ఎంతమంది వస్తారు అని పోలీసులు అడిగారు.. అయినా సరైన సమాధానం లేదన్న ఆమె.. పరామర్శ కు వెళ్లే వ్యక్తి రోడ్ షో చేశారు.. అందరికి అభివాదాలు.. షేక్హ్యాండ్లు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లారని విమర్శించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
బండి (కారు) కింద పడిపోతే కనీసం అంబులెన్స్ లో తరలించాలి కదా ? యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ముళ్ల పొదల్లో వదిలేశారు. జగన్ కు రాజకీయ లబ్ది తప్ప మనుషుల ప్రాణాలు లెక్కలేదా..? ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత.. ఏడాది క్రితం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దగ్గరకు జగన్ వెళ్లారు అని విమర్శించారు.. బాబాయ్ హత్య.. కోడి కత్తి డ్రామా… ఇవన్నీ చూసాం.. ఇంకా సమర్ధించుకుని మాట్లాడుతున్నారు. జాలి దయ.. లాంటి పదాలు మాట్లాడడానికి అసలు అర్హత లేని వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్.. ఇప్పుడు జగన్ పర్యటనలు అలాగే ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. రెంటపాళ్ల పర్యటనలో ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు.. చాలా తక్కువ మంది వెళ్లాలని చెప్పారు.. పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేశారని దుయ్యబట్టారు అనిత..
Read Also: Trisha: మరోసారి రచ్చ రేపిన త్రిష?
ఒకడు నరికేస్తాం అంటాడు. ఇంకొకడు కోసేస్తాం అంటాడు.. ఇవన్నీ మాట్లాడితే తప్పేంటి అని జగన్ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత. ఎక్కడ యాక్సిడెంట్ అయిన ఎవరైనా ఏదో ఒక సహాయం చేస్తారు.. స్వయంగా సీఎం చంద్రబాబు దిగి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ, జగన్ కు మానవత్వం లేదనే సంగతి క్లియర్ గా అర్ధం అవుతోందన్నారు.. చంద్రబాబు ఇంటి గేట్లకు తాళ్లు కట్టిన సంగతి జగన్ మర్చిపోయారా.? తిరుపతి విమానాశ్రయం లో చంద్రబాబు కూర్చుని ధర్నా చేసిన సంగతి జగన్ మర్చిపోయారా? లోకేష్ ఎన్ని సార్లు అడ్డుకోలేదు..? నేను ఎన్నోసార్లు టూ వీలర్ పై తిరిగా.. నా కార్ ఆపితే టూ వీలర్ లో తిరిగా.. ఆంక్షలను విధించానా అని అమాయకంగా జగన్ మాట్లాడుతున్నారు అంటూ జగన్పై ఫైర్ అయ్యారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?