RK Roja: కుప్పం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు..?
- కుప్పం ఘటన చాలా బాధాకరం..
- సీఎం నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులా..?
- రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
- ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజన్న సీఎం చంద్రబాబు..
- ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్న ఆర్కే రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: కుప్పం ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా…? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు అన్న సీఎం చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతాడు…? అని నిలదీశారు ఆర్కే రోజా..
Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
నీ సొంత (కుప్పం) నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరేం చర్యలు తీసుకున్నారు.. అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు రోజా.. తెలుగుదేశం పార్టీ నేత ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టాడు.. ఆ తెలుగుదేశం పార్టీకి నేతకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ? చంద్రబాబు అన్నా.. హోమ్ మంత్రి అన్నా.. వారి పార్టీ కార్యకర్తలకే భయం లేదని విమర్శించారు.. ఎంత హింస చేస్తే అంత మంచి పదవి అని.. లోకేష్ చెప్పడంతో అంతా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. అనంతపురంలో 14 మంది టీడీపీ నేతలు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు… కనీసం పరిటాల సునీత ఆ అమ్మాయి పరామర్శించలేదు.. కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు.. హోం మంత్రికి ఎంత అహంకారం ఉంటే బాధితురాలిని వీడియో కాల్ ద్వారా పరామర్శిస్తుంది…? అని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత.. ఇలా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?