Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
- భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన రోజు
- ఒకే రోజు బరిలోకి మూడు భారత జట్లు
- క్రికెట్ అభిమానులకు ట్రిపుల్ ధమాకా
- 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Wednesday in Indian Cricket: భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు (జూన్ 17) ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. క్రికెట్ అభిమానులకు ఉదయం నుంచి రాత్రి వరకు నాన్స్టాప్ వినోదం అందించేందుకు మూడు భారత జట్లు మైదానంలోకి దిగుతున్నాయి. ఇండియా-ఎ జట్టు, పురుషుల సీనియర్ జట్టు, భారత మహిళల జట్టు ఒకే రోజు వేర్వేరు టోర్నీల్లో మ్యాచ్లు ఆడనున్నాయి. దాదాపు 12 గంటల పాటు వరుసగా క్రికెట్ మ్యాచ్లు ఉండటంతో.. ఈ బుధవారం అభిమానులకు అసలైన క్రికెట్ పండగగా మారనుంది.
ఉదయం 10 గంటలకు ఇండియా-ఎ పోరు:
రోజు క్రికెట్ పండగ ఇండియా-ఎ జట్టు మ్యాచ్తో మొదలుకానుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సారథ్యంలో ఇండియా-ఎ జట్టు అఫ్గానిస్థాన్-ఎతో తలపడనుంది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిన భారత్.. ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే విజయం తప్పనిసరి. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునే కీలక అవకాశంగా ఈ మ్యాచ్ నిలవనుంది. అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీపై ఉంది. వరుసగా రెండు మ్యాచ్లలో నిరాశపర్చిన బుడ్డోడు.. ఈరోజైనా చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
- Ind Vs Eng: ప్రతీ మ్యాచ్లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
- IND vs ENG 5th T20: 'వైట్వాష్' ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
- Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
మధ్యాహ్నం 1:30 గంటలకు సీనియర్ టీమ్ సందడి:
మధ్యాహ్నం 1:30 నుంచి భారత సీనియర్ పురుషుల జట్టు రంగంలోకి దిగనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా అఫ్గానిస్థాన్తో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. ఈ పోరులోనూ గెలిచి సిరీస్ను ఖాయం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్స్ కూడా జట్టులో ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాత్రి 7 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్:
ఇక చివరగా భారత మహిళల జట్టు అభిమానులను అలరించనుంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడనుంది. గత మ్యాచ్లో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన హర్మన్ సేన.. అదే జోష్ను కొనసాగించాలని భావిస్తోంది. సెమీఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ మ్యాచ్లో విజయం కీలకంగా మారింది.
అభిమానులకు అసలైన క్రికెట్ పండగ:
ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా రాత్రి 10 గంటల వరకు మూడు భారత జట్లు వరుసగా బరిలోకి దిగడం అరుదైన సందర్భం అనే చెప్పాలి. బహుశా ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకే రోజు ఇండియా-ఎ, పురుషుల సీనియర్ జట్టు, మహిళల టీమ్ మ్యాచ్లు చూడే అవకాశం రావడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. మొత్తం మీద ఈ బుధవారం భారత క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ ఫీస్ట్గా మారనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!