Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh : గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. అయితే 2025లో విడుదలైన కొన్ని సినిమాల బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు 2026ను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కోర్ట్రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యవాన్ సావిత్రి’పై ఆమె ఆశలు పెట్టుకుంది. ఈరోజు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ‘సత్యవాన్ సావిత్రి’ 2026 జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుందని ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఒక న్యాయవాది పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటివరకు పలు కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించిన ఆమె, ఈసారి కోర్ట్రూమ్ నేపథ్యంలో సాగే పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. హార్ట్ బీట్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన చారుకేష్తో పాటు బాల శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, ఆర్. సుందరరాజన్, బ్రిగిడా, మాలా పార్వతి, ఎ. వెంకటేష్ తదితరులు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డ్రమ్స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వేదికకారన్పట్టి ఎస్. శక్తివేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జీ స్టూడియోస్ సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ, తెలుగులో విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే కీర్తి సురేష్కు తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమాన వర్గం ఉండటంతో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కోర్ట్రూమ్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో, నిర్మాతలు త్వరలో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ... కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
- Tamannaah Bhatia : షారూఖ్ నుంచి షాకింగ్ ఆఫర్... ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన తమన్నా
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ' మూవీ స్టోరీ లీక్
- Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
‘సత్యవాన్ సావిత్రి’ మాత్రమే కాదు, 2026లో కీర్తి సురేష్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతున్న ‘రఫ్తార్’తో పాటు తమిళంలో ‘కన్నివేది’, తెలుగులో ‘రౌడీ జనార్దన’, మలయాళంలో ‘తోట్టం: ది డెమెస్నే’ చిత్రాల్లో కూడా ఆమె నటిస్తోంది. అంతేకాకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో కీర్తి కథానాయికగా నటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్కు 2026 కీలకమైన సంవత్సరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన నిరాశలను వెనక్కి నెట్టి, బలమైన కథలు, విభిన్న పాత్రలతో మరోసారి తన నటనను నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘సత్యవాన్ సావిత్రి’ విజయం సాధిస్తే, కీర్తి కెరీర్లో మరో కీలక మలుపుగా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
- Tags
- cinema
- keerthy suresh
తాజావార్తలు
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?