Pawan Kalyan: సినీ హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
- సినీ హీరోలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- పవన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ..
- డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్..
- పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని స్పష్టం..
- చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ ఆలోచనగా పేర్కొన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. సినిమాలలో పాత్రల మీద పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నారు.. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డీఎఫ్వోగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్స్ చేయరని పేర్కొన్నారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేదే పవన్ కల్యాణ్ ఆలోచనగా స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. మరోవైపు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? అని ప్రశ్నించారు.. జగన్ కు ఇంకిత జ్ఞానం ఉండాలి అంటూ ఎద్దేవా చేశారు. మేం సరిగ్గా పరిపాలన కొనసాగిస్తున్నాం.. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల పై మాట్లాడాలి.. తనకు సమస్యలు ఉన్నాయని.. మాట్లాడటం జగన్ మార్చుకోవాలి అని హితవుపలికారు.. ప్రతిపక్ష హోదా పక్కన పెట్టండి.. తాడు బొంగరం లేని పార్టీ.. వైసీపీ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పటికీ ఈసీ రికార్డుల్లో పార్టీకి ఎవరు అధ్యక్షులో క్లారిటీ లేదన్నారు.. జనసేనకు లోక్ సభలో ఇద్దరు సభ్యులు ఉన్నారు.. ప్రజలకు మేలు జరిగేలా పనిచేస్తారు.. రాష్ట్రంలో గత పరిపాలనలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం కలిగించింది.. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి సహకరించాలని, భరోసా ఇవ్వాలనే భావన వాళ్లలో కనిపిస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?