Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
- యూపీలో సీరియల్ కిల్లర్ కలకలం..
- 13 నెలల్లో ఒకే తరహాలో 9 మంది మహిళల హత్య..
- చెరుకు తోటల్లో చీరతో ఉరేసి దారుణం..
- నిందితుడి స్కెచ్ విడుదల చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial Killer: ఉత్తర్ ప్రదేశ్ బరేలీ జిల్లాలోని పలు గ్రామాల్లో వరసగా మహిళల హత్యలు సంచనలంగా మారాయి. దాదాపుగా 13 నెలల వ్యవధిలో ఒకే వయసులో ఉన్న 9 మంది మహిళలు ఒకే తరహాలో హత్య చేయబడ్డారు. దీంతో ‘సీరియల్ కిల్లర్’ ఈ హత్యలకు పాల్పడుతున్నాడనే అనుమానం కలుగుతోంది. పోలీసులు ఈ దిశగా దృష్టి సారిస్తు్న్నారు. మహిళలందర్ని ఒకే రీతిలో చీరతో గొంతుకు ఉరేసి చంపుతున్నాడు.
షాహి, షీష్గఢ్ మరియు షెర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది 40-65 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. అన్ని సమయాల్లో పొలాల్లో పనిచేస్తున్న మహిళల్ని టార్గెట్ చేశారు. చెరుకు తోటల్లో బట్టలు చింపేసిన స్థితిలో వారి మృతదేహాలు కనిపించాయి. అయితే, అత్యాచారానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు కనిపంచలేదు. ఈ హత్యల్లో మహిళలు కట్టుకున్న చీరతోనే గొంతుకు బిగించి హత్య చేశారు. గతేడాది జూన్లో వరుసగా మూడు హత్యలు జరిగాయి, జూలై, ఆగస్టు మరియు అక్టోబర్లలో ఒక్కొక్కటి మరియు నవంబర్లో రెండు హత్యలు జరిగాయి.
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
Read Also: Kaalam Raasina Kathalu: పునర్జన్మలు- పరువు హత్యలు.. ఆసక్తికరంగా కాలం రాసిన కథలు ట్రైలర్
8 హత్యల తర్వాత, 300 మంది పోలీసులతో 14 ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. యూనిఫాంతో పాటు సివిల్ డ్రెస్సుల్లో సంచరిస్తూ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీస్ నిఘా పెరిగిన తర్వాత ఏ హత్య కూడా జరగలేదు. నిందితుడు పట్టుబడనప్పటికీ 7 నెలల పాటు ఎలాంటి హత్య జరగలేదు. అయితే, ఈ ఏడాది జూలై నెలలో 45 ఏళ్ల అనిత అనే మహిళని ఇదే విధంగా చీరతో గొంతు నులిమి పొలంలో హత్య చేయబడింది. షేర్ఘర్ లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఫతేగంజ్లోని ఖిర్కా గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. జూలై 2న ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లింది. ఆ తర్వాత చెరకు తోటలో శవంగా కనిపించింది.
ఈ హత్యల వెనక సీరియల్ కిల్లర్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తు్న్నారు. డీజీపీ దగ్గర నుంచి ఐజీలు కూడా ఈ హత్యల కేసుని పర్యవేక్షిస్తున్నారు. హత్యలు జరిగిన ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి అనుమాతుల స్కెచ్ విడుదల చేశారు. హంతకుడిని పట్టుకునేందుకు చాలా టీమ్లు గాలిస్తు్న్నాయి. పెట్రోలింగ్, చెక్పోస్టులని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో హెచ్చరిక బోర్డుల్ని ఏర్పాటు చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా వివరాలు తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయానికి 9554402549 మరియు 9258256969 నంబర్లకి కాల్ చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!