Minister Dola Bala Veeranjaneya Swamy: వైసీపీపై మంత్రి ఫైర్.. రికార్డులు కావాలన్నా ఇస్తాం..!
- వైసీపీపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఫైర్..
- గతంలో వసతి దీవెన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా?..
- దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dola Bala Veeranjaneya Swamy: అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు.. గత ప్రభుత్వ బకాయిలు తీర్చే పనిలో ఉన్నామన్నారు.. మీ హయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు కూడా రాయకుండా ఆగిపోయారన్నారు.. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు..
Also Read
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ఇక, విద్యుత్ చార్జీల భారం పడటానికి గతంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్ లే కారణం కాదా..? అని నిలదీశారు మంత్రి వీరాంజనేయస్వామి.. మీ పాపాలనే తాము మోస్తున్నాం తప్ప వేరొకటి కాదన్నారు.. అసలు అప్పుడు ఎందుకు ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారో బయటపెట్టాలన్నారు.. దారుణంగా ఇతరుల ఆస్తులను లాక్కున్నారని.. రెవెన్యూ కుంభకోణంలో త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.. మరోవైపు కమీషన్ల గురించి, అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్ ఇచ్చారు.. ఇక, దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు, దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు వైసీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. జగన్ భ్రమల్లో విహరించడం మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని లేకుంటే పూర్తిగా పతనమవుతారని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!