Minister Dola Bala Veeranjaneya Swamy: వైసీపీపై మంత్రి ఫైర్.. రికార్డులు కావాలన్నా ఇస్తాం..!
- వైసీపీపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఫైర్..
- గతంలో వసతి దీవెన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా?..
- దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dola Bala Veeranjaneya Swamy: అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు.. గత ప్రభుత్వ బకాయిలు తీర్చే పనిలో ఉన్నామన్నారు.. మీ హయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు కూడా రాయకుండా ఆగిపోయారన్నారు.. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు..
Also Read
ఇక, విద్యుత్ చార్జీల భారం పడటానికి గతంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్ లే కారణం కాదా..? అని నిలదీశారు మంత్రి వీరాంజనేయస్వామి.. మీ పాపాలనే తాము మోస్తున్నాం తప్ప వేరొకటి కాదన్నారు.. అసలు అప్పుడు ఎందుకు ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారో బయటపెట్టాలన్నారు.. దారుణంగా ఇతరుల ఆస్తులను లాక్కున్నారని.. రెవెన్యూ కుంభకోణంలో త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.. మరోవైపు కమీషన్ల గురించి, అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్ ఇచ్చారు.. ఇక, దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు, దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు వైసీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. జగన్ భ్రమల్లో విహరించడం మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని లేకుంటే పూర్తిగా పతనమవుతారని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!