Minister Dola Bala Veeranjaneya Swamy: వైసీపీపై మంత్రి ఫైర్.. రికార్డులు కావాలన్నా ఇస్తాం..!
- వైసీపీపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఫైర్..
- గతంలో వసతి దీవెన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా?..
- దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dola Bala Veeranjaneya Swamy: అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు.. గత ప్రభుత్వ బకాయిలు తీర్చే పనిలో ఉన్నామన్నారు.. మీ హయంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలు కూడా రాయకుండా ఆగిపోయారన్నారు.. విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరంటూ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు..
Also Read
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
ఇక, విద్యుత్ చార్జీల భారం పడటానికి గతంలో మీరు చేసుకున్న అగ్రిమెంట్ లే కారణం కాదా..? అని నిలదీశారు మంత్రి వీరాంజనేయస్వామి.. మీ పాపాలనే తాము మోస్తున్నాం తప్ప వేరొకటి కాదన్నారు.. అసలు అప్పుడు ఎందుకు ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారో బయటపెట్టాలన్నారు.. దారుణంగా ఇతరుల ఆస్తులను లాక్కున్నారని.. రెవెన్యూ కుంభకోణంలో త్వరలో అరెస్టులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు.. మరోవైపు కమీషన్ల గురించి, అవినీతి గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కౌంటర్ ఇచ్చారు.. ఇక, దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు, దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు వైసీపీ హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. జగన్ భ్రమల్లో విహరించడం మాని ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని లేకుంటే పూర్తిగా పతనమవుతారని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!