Kinjarapu Atchannaidu: బాధ్యతలు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఆరు ఫైళ్లపై సంతకాలు..
- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు..
- సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతల స్వీకరణ..
- ఆరు ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kinjarapu Atchannaidu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఛాంబర్లలో మార్పులు, చేర్పులతో.. కొందరు మంత్రుల బాధ్యతల స్వీకరణ ఆలస్యం అయ్యింది.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పటి వరకు సచివాలయంలోని తన ఛాంబర్ సిద్ధం కాకపోవడంతో ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నను టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందలు తెలిపారు.. మరోవైపు.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం చేసిన ఆయన.. వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం.. 217 జీవో రద్దు చేస్తూ మరో సంతకం.. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం.. పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెస్పై ఇలా ఆరు సంతకాలు చేశారు..
Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ఇక, ఈ సందర్భంగా మంత్రి అచెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారు.. కానీ, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు.. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తాం అన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని వివరించారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!