Minister Seethakka: సీతక్క సంచలన వ్యాఖ్యలు.. పార్టీకి చెల్లి రాజీనామా చేస్తుందేమోనని భయం పట్టుకుంది..
- కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది..
- పార్టీకి చెల్లి రాజీనామా చేస్తుందేమోనని భయం పట్టుకుంది..
- కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు: మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ఎన్టీవీతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించింది. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడు అంటూ మండిపడింది. చెల్లి రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుంది అన్నారు. కమిషన్లకి కక్కుర్తి పడ్డది కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీది కమిషన్ల ప్రభుత్వం, కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం మాది అని ఆమె అన్నారు. ఇక, సుందరిమణుల్లో ఒకరికో ఒక్క అమ్మాయి అలా చేస్తే దాన్ని ప్రభుత్వానికి అంట గట్టడం అవివేకం, దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు..గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో భూములు మారిపోయాయని మంత్రి సీతక్క పేర్కొనింది.
Read Also: Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.
Also Read
అయితే, ధరణిలో మోఖ మీద ఉన్న రైతులకు కాకుండా వేరే వాళ్ళకి భూములు పట్టాలు చేశారని సీతక్క అన్నారు. భూమి న్యాయంగా ఎవ్వరికి దక్కాలో వారికే దక్కేందుకు తీసుకొచ్చిందే భూ భారతి లక్ష్యం.. భూ స్వాములకు తిరిగి భూములు తీసుకోవడం కోసం ధరణి పని చేసింది.. జూన్ 2వ తేదీ నుంచి రైతుల కనీళ్లు తుడిచేది భూ భారతి అమలు చేస్తున్నాం.. ఇక, రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు.. ఐటిడిఎల పరిధిలో ఉన్న వాళ్ళకు స్పెషల్ గా ఇండ్లు ఇస్తాం.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ఇండ్లు.. ప్రజా ప్రతినిధులు అర్హత లేని వారు ఉంటే చెప్పండి తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ లిస్టులో రాకపోతే తరువాత వచ్చే లిస్టులో ఉంటదని మంత్రి సీతక్క వెల్లడించింది.
Read Also: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇక, భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా రెండో విడత పెంచికల్ పెట్ లో నిర్వహించడం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. 12 ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న చిక్కు ముడులను తీయడానికి భూ భారతి చట్టం తీసుకొచ్చాం.. కాస్తూ కాలం తీసేయడంతో రైతులు ఆత్మహత్యలు, అధికారులపై దాడులు జరిగాయి.. కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీ కూడా ధరణిని తీసేస్తామని అన్నారు.. రైతు హక్కులు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. పోడు చేస్తున్న రైతులకు గిరి వికాసం క్రింద సోలార్ ను అందించి భూమి సస్యశ్యామలం చేయాలని కోరారు.. ప్రతి నియోజకవర్గంలో3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. ఐటిడిఎ నుంచి కూడా ఆదివాసులకు అందించేందుకు చర్యలు చేపట్టాం.. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు రైతులకు సహకరించాలి, ఎలాటి ఇబ్బందులు పెట్టొదని పేర్కొన్నారు. కొత్త అడవిని కొట్టవద్దు. దాని కోసం అవగాహన కల్పిస్తామని సీతక్క చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!