Minister Seethakka: సీతక్క సంచలన వ్యాఖ్యలు.. పార్టీకి చెల్లి రాజీనామా చేస్తుందేమోనని భయం పట్టుకుంది..
- కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది..
- పార్టీకి చెల్లి రాజీనామా చేస్తుందేమోనని భయం పట్టుకుంది..
- కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు: మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ఎన్టీవీతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించింది. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడు అంటూ మండిపడింది. చెల్లి రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుంది అన్నారు. కమిషన్లకి కక్కుర్తి పడ్డది కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీది కమిషన్ల ప్రభుత్వం, కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం మాది అని ఆమె అన్నారు. ఇక, సుందరిమణుల్లో ఒకరికో ఒక్క అమ్మాయి అలా చేస్తే దాన్ని ప్రభుత్వానికి అంట గట్టడం అవివేకం, దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ అబద్ధాలు చెప్పి కాలం వెల్లదిస్తున్నారు..గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో భూములు మారిపోయాయని మంత్రి సీతక్క పేర్కొనింది.
Read Also: Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.
Also Read
అయితే, ధరణిలో మోఖ మీద ఉన్న రైతులకు కాకుండా వేరే వాళ్ళకి భూములు పట్టాలు చేశారని సీతక్క అన్నారు. భూమి న్యాయంగా ఎవ్వరికి దక్కాలో వారికే దక్కేందుకు తీసుకొచ్చిందే భూ భారతి లక్ష్యం.. భూ స్వాములకు తిరిగి భూములు తీసుకోవడం కోసం ధరణి పని చేసింది.. జూన్ 2వ తేదీ నుంచి రైతుల కనీళ్లు తుడిచేది భూ భారతి అమలు చేస్తున్నాం.. ఇక, రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు.. ఐటిడిఎల పరిధిలో ఉన్న వాళ్ళకు స్పెషల్ గా ఇండ్లు ఇస్తాం.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ఇందిరమ్మ ఇండ్లు.. ప్రజా ప్రతినిధులు అర్హత లేని వారు ఉంటే చెప్పండి తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ లిస్టులో రాకపోతే తరువాత వచ్చే లిస్టులో ఉంటదని మంత్రి సీతక్క వెల్లడించింది.
Read Also: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇక, భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా రెండో విడత పెంచికల్ పెట్ లో నిర్వహించడం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. 12 ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న చిక్కు ముడులను తీయడానికి భూ భారతి చట్టం తీసుకొచ్చాం.. కాస్తూ కాలం తీసేయడంతో రైతులు ఆత్మహత్యలు, అధికారులపై దాడులు జరిగాయి.. కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాహుల్ గాంధీ కూడా ధరణిని తీసేస్తామని అన్నారు.. రైతు హక్కులు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. పోడు చేస్తున్న రైతులకు గిరి వికాసం క్రింద సోలార్ ను అందించి భూమి సస్యశ్యామలం చేయాలని కోరారు.. ప్రతి నియోజకవర్గంలో3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. ఐటిడిఎ నుంచి కూడా ఆదివాసులకు అందించేందుకు చర్యలు చేపట్టాం.. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు రైతులకు సహకరించాలి, ఎలాటి ఇబ్బందులు పెట్టొదని పేర్కొన్నారు. కొత్త అడవిని కొట్టవద్దు. దాని కోసం అవగాహన కల్పిస్తామని సీతక్క చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!