Speaker Ayyanna Patrudu: సమాన అవకాశం కల్పిస్తా.. సభకు రండి.. జగన్కు స్పీకర్ సూచన
- సమాన అవకాశం కల్పిస్తా.. సభకు రండి..
- వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ విజ్ఞప్తి..
- అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలన్న స్పీకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు వస్తారా? రారా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.. అయితే, దమ్ముంటే సభకు రావాలంటూ సీఎం చంద్రబాబు సవాల్ చేయడం.. సభకు వచ్చేందుకు సిద్ధమే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
Read Also: Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
మరోవైపు, వైఎస్ జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను ఎక్స్ లో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాట్లాడుతుండటాన్ని తప్పుబట్టిన ఆయన.. ప్రతిపక్ష హోదా నిబంధనలపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానంటూ పేర్కొన్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు.. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.. దీనిపై రేపు జరిగే కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు..
Read Also: Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
“పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ని అసెంబ్లీకి సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి.. సభకి రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి.. స్పీకర్ గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తా..” అంటూ ట్వీట్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
పులివెందుల ఎమ్మెల్యే @ysjagan గారిని అసెంబ్లీకి సిద్ధమా అంటూ @ncbn గారు ఛాలెంజ్ చేశారు..
ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు..
11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి..
సభకి రండి..ప్రజా సమస్యలపై చర్చించండి..
స్పీకర్ గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తా.. pic.twitter.com/6X5eOwo3DZ
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) September 2, 2025
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..