Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
- ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు
- హుక్కా తాగే వాళ్లకే ధోనీ జట్టులో చోటు
- నాకు ఎవరి గదిలో హుక్కా తాగే అలవాటు లేదు
- క్రికెటర్ పని మైదానంలో బాగా రాణించడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ పతనం వెనుక ధోనీ హస్తం ఉందని అప్పట్లో పఠాన్ పరోక్షంగా చెప్పాడు. మెరుగైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా తనను జట్టు నుంచి తప్పించారని, 2008 ఆస్ట్రేలియాతో సిరీస్లో తాను బాగా బౌలింగ్ చేయలేదని ధోనీ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హుక్కా తాగే వాళ్లకే ధోనీ జట్టులో చోటు అని, హుక్కా తాగలేదనే కారణంతోనే తనను జట్టు నుంచి తప్పించాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఇర్ఫాన్ పఠాన్ అరంగేట్రం చేశాడు. 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో పఠాన్కు తొలి అవకాశం లభించింది. ఒకానొక సమయంలో ఇర్ఫాన్ అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రధాన ఆల్రౌండర్. 2009లో అతడి కెరీర్ గాడి తప్పగా.. 2011 వన్డే ప్రపంచకప్కు ముందు ప్రభావం పూర్తిగా తగ్గింది. దాంతో మెగా టోర్నీలో భారత జట్టులో స్థానం లభించలేదు. 2011 వన్డే ప్రపంచకప్కు ఇర్ఫాన్ స్థానంలో స్థానంలో అతడి అన్నయ్యను యూసుఫ్కు స్థానం కల్పించారు. మరోవైపు సురేష్ రైనాను బ్యాకప్గా ఎంపిక చేశారు. అంతకుముందు 2009లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో ఇర్ఫాన్, యూసుఫ్ కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఓ మ్యాచ్లో 28 బంతుల్లో 60 పరుగులు చేయాల్సి ఉండగా.. అన్నదమ్ములు చెలరేగి జట్టును గెలిపించారు.
Also Read
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
Also Read: Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!
కీలక మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన తర్వాత ఇర్ఫాన్ పఠాన్ను భారత జట్టు నుంచి తొలగించారు. ఈ విషయంపై అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ను ఇర్ఫాన్ ప్రశ్నంచగా.. రెండు కారణాలు చెప్పాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో ఉండవని, తుది జట్టు ఎంపిక కెప్టెన్ చేతుల్లో ఉంటుందని కిర్స్టెన్ చెప్పినట్లు ఇర్ఫాన్ తెలిపాడు. జట్టుకు 7వ స్థానంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ అవసరమని జట్టు భావిస్తోందని కిర్స్టెన్ చెప్పారని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ‘నాకు ఎవరి గదిలో హుక్కా తాగే అలవాటు లేదు. ఎవరు ఏమి చేసేవారో అందరికీ తెలుసు. క్రికెటర్ పని మైదానంలో బాగా రాణించడమే. నేను దీనిపై మాత్రమే దృష్టి పెట్టేవాడిని’ అని ఇర్ఫాన్ చెప్పాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ హుక్కా తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హుక్కా తాగే ఆటగాళ్లకే ధోనీ జట్టులో ప్రాధాన్యత ఇచ్చేవారనే ప్రచారం జరిగింది.
తాజావార్తలు
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
-
Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
-
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
-
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..