CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..
- అసెంబ్లీలో 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్పై మాట్లాడిన సీఎం చంద్రబాబు
- వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించాం- సీఎం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు- చంద్రబాబు
- నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి- ముఖ్యమంత్రి
- 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి- సీఎం
- రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది- సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – 2047’ డాక్యుమెంట్పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనం స్వర్ణాంధ్ర – 2047తో ముందుకెళ్లాలి.. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని చెప్పారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలే ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
అనివార్య పరిస్ధితుల్లో 1999లో ధరలు పెంచాం.. ప్రజలు నమ్మారు.. మార్చక్కర్లేని విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు.. అధికార యంత్రాంగం మొత్తం నిర్వర్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు తీవ్రస్థాయికి చేరాయి.. తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆస్ట్రేలియన్లను కంగారెత్తించిన భారత బౌలర్లు
సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్ధిక అసమానతల పైన ప్రత్యేకంగా ఆలోచించాలి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఏపీగా మారుతామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తేనే మోదీ వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు. పది సూత్రాలతో అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీ ఉద్యోగాలు రావాలని చెప్పారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్దికి ప్రధాన్యత ఇచ్చాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గడానికి టెక్నాలజీ సపోర్టు తీసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు. తాను అనునిత్యం ఒక స్టూడెంట్ని.. అది నా బాధ్యత.. చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలను ఒక క్యాపిటల్గా తీసుకుని.. షార్ట్, లాంగ్, మిడిల్ టర్మ్లలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!