CM Chandrababu: వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..
- అసెంబ్లీలో 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్పై మాట్లాడిన సీఎం చంద్రబాబు
- వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించాం- సీఎం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు- చంద్రబాబు
- నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి- ముఖ్యమంత్రి
- 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలి- సీఎం
- రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది- సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – 2047’ డాక్యుమెంట్పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనం స్వర్ణాంధ్ర – 2047తో ముందుకెళ్లాలి.. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని చెప్పారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలే ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Mumbai 26/11 attack: భారత్కి అప్పగింతను వ్యతిరేకిస్తూ, యూఎస్ సుప్రీంకోర్టుకు ఉగ్రవాది రానా..
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
అనివార్య పరిస్ధితుల్లో 1999లో ధరలు పెంచాం.. ప్రజలు నమ్మారు.. మార్చక్కర్లేని విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నేర రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేశారు.. అధికార యంత్రాంగం మొత్తం నిర్వర్యమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అప్పులు తీవ్రస్థాయికి చేరాయి.. తప్పుడు ప్రచారాన్నే ఆధారంగా చేసుకుని పనిచేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారు.. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆస్ట్రేలియన్లను కంగారెత్తించిన భారత బౌలర్లు
సంపద కలిగిన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఏపీ తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్ధిక అసమానతల పైన ప్రత్యేకంగా ఆలోచించాలి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఏపీగా మారుతామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తేనే మోదీ వికసిత్ భారత్ సాకారం అవుతుందని అన్నారు. పది సూత్రాలతో అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని.. ప్రతీ ఒక్కరికీ క్వాలిటీ ఉద్యోగాలు రావాలని చెప్పారు. రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్దికి ప్రధాన్యత ఇచ్చాం.. వ్యవసాయ ఖర్చులు తగ్గడానికి టెక్నాలజీ సపోర్టు తీసుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు. తాను అనునిత్యం ఒక స్టూడెంట్ని.. అది నా బాధ్యత.. చేస్తూనే ఉంటానన్నారు. ప్రజలను ఒక క్యాపిటల్గా తీసుకుని.. షార్ట్, లాంగ్, మిడిల్ టర్మ్లలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!